జగన్ కు రెడ్ల రెడ్ సిగ్నల్

Publish Date:Jun 19, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఉనికి మాత్రంగానైనా రాష్ట్రంలో మనగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించి ఘనంగా అధికారం చేపట్టిన వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ నిర్వాకం కారణంగా ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. తాజా ఎన్నికలలో ఆ పార్టీ ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ షాక్ నుంచి జగన్ మోహన్ రెడ్డి ఇప్పట్లో తేరుకోవడం కష్టమేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. 

అయితే జగన్ మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదనీ, నేర్చుకోవడానికి సిద్ధంగా లేడనీ చెప్పడానికి ఆయన తాజాగా ఈవీఎంల కారణంగానే వైసీపీ పరాజయం పాలైందంటూ చేసిన ట్వీట్ ను తార్కానంగా చూపుతున్నారు.   కాగా ఇంతటి ఘోర పరాజయానికి అసలైన కారణాలు ఏమిటన్నది ఆత్మపరిశీలన చేసుకుని తెలుసుకునే ఉద్దేశమే జగన్ కు లేనట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఏ వర్గమూ కూడా జగన్ పాలనలో సంతోషంగా లేదు. ఏ వర్గమూ జగన్ కు ఓటేయాలని భావించలేదు. ఐదేళ్లు పంటి బిగవున కప్పి పెట్టిన ఆగ్రహాన్ని ఓటు అనే ఆయుధంగా మార్చి జగన్ ను తిరిగిలేచే అవకాశం లేని దెబ్బ కొట్టారు.  అన్ని సామాజిక వర్గాలూ జగన్ ను తిరస్కరించాయనడానికి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇట్టే అవగతమౌతుంది.  

వైసీపీకి గట్టి దన్నుగా, బలంగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ సారి జగన్ ను  తిరస్కరించారని ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్ధమైపోతుంది. రాష్ట్రంలో  3.5 శాతంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే వైసీపీ అభ్యర్థులలో అత్యధికంగా ఉన్నారు.  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో రెడ్డి సమాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు జగన్ 49 స్థానాలు కేటాయించారు.  అంటే మొత్తం స్థానాలలో జగన్ 28 శాతం తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు.  సరే మొత్తం స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన 36 స్థానాలను మినహాయిస్తే జగన్ రెడ్డి తాజా ఎన్నికలలో రెడ్డి సమాజిక వర్గానికి 35శాతానికి పైగా స్థానాలను కేటాయించారు. అదే రాయల సీమ విషయానికి వస్తు ఇది ఇంకా ఎక్కువ. సీమలోని మొత్తం 52 స్థానాలలో వైసీపీ అభ్యర్థులలో  33 స్థానాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే ఉన్నారు.  అంటే సీమలో మొత్తం స్థానాలలో 63.4 శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్ రెడ్డి వైసీపీ టికెట్లు కేటాయించారు. అదే రాయలసీమ ప్రాంతంలోని 9 ఎస్సీ రిజర్వేషన్ సీట్లను మినహాయిస్తే ఈ శాతం 75కు పెరుగుతుంది. అలాగే జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాలలో  సొంత సామాజికవర్గానికి చెందిన వారినే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టారు.  

ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులలో జగన్ రెడ్డితో సహా ఆరుగురు మాత్రమే విజయం సాధించారు.  జగన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డి విజయం సాధించినా.. గత ఎన్నికల కంటే మెజారిటీ తగ్గింది. ఇక రెడ్డి సామాజికవర్గ జనాభా అధికంగా ఉన్న రెండో నియోజకవర్గం అనపర్తి. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ విజయం సాధించారు.  ఈ ఉదాహరణలే చాలు రెడ్డి సామాజిక వర్గం వైసీపీని, జగన్ ను తిరస్కరించిందని చెప్పడానికి.  

సరే వైసీపీ నుంచి విజయం సాధించిన రెడ్డి సామాజిక  వర్గ అభ్యర్థులలో జగన్ ను మినహాయించి మిగిలిన వారి విషయాన్ి వస్తే వారిలో ఎవరికీ కూడా  15 వేల ఓట్లకు మించి మెజారిటీ రాలేదు.  పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నేతగా గుర్తింపు పొందిన పుంగనూరు అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మరో ఇద్దరు రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు రెండు వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.   ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ రెడ్డి తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెడ్డి సామాజిక వర్గంలో  ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.