ఆయుర్వేదం మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మందికి తెలియని నిజాలివి..!

Publish Date:Feb 7, 2025

Advertisement

 

భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రజలు  ఆయుర్వేద చికిత్సపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిజానికి ఒకప్పుడు ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేద వైద్యమే జరిగేది. అయితే అల్లోపతి వైద్యం విస్తృతంగా వ్యాప్తి చెందాక ఆయుర్వేద వైద్యం ఆదరణ తగ్గింది. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఫలితాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఆయుర్వేదం  ఏ జబ్బును అయినా నిర్మూలిస్తుంది.  శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. కానీ అల్లోపతి శరీరాన్ని మత్తులోకి నెడుతుంది. చాలా రకాల జబ్బులను తాత్కాలికంగా మాత్రమే నయం చేయగలుగుతుంది.  అల్లోపతి వల్ల పెద్ద పెద్ద జబ్బులు నయం అయినా శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది.  దీన్ని అర్థం చేసుకున్న ప్రజలు తిరిగి ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తున్నారు.  ఆయుర్వేదంలో  చిన్న చిన్న జబ్బుల నుండి అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స సాధ్యమవుతుంది. అలాగే డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆయుర్వేద చికిత్సపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఆయుర్వేదం అనేది శరీరం, మనస్సు, ఆత్మ,  పర్యావరణం మధ్య సమతుల్యతను ప్రోత్సహించే భారతదేశ సాంప్రదాయ వైద్య విధానం. ఈ వైద్య విధానంలో మూలికలు, మొక్కలు, పువ్వులు,  పండ్లతో తయారు చేసిన మందులను వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో మసాజ్, యోగా,  ధ్యానం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఆయుర్వేదం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని  చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజంగా నిజమేనా? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు దీని గురించి సమాచారం సరైన సమాధానం అందించారు. ఆయుర్వేద మందులకు నిజంగా దుష్ప్రభావాలు లేవా లేదా అది కేవలం అపోహనా అనే విషయం తెలుసుకుంటే..

ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఆయుర్వేద  మందులకు కూడా దుష్ప్రభావాలు ఉంటాయి.   కానీ వైద్యుల సలహా మేరకు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.   డాక్టర్ల ప్రకారం భారతదేశంలో  డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మందులను కొనుగోలు చేసి  వాడుతుంటారు.  ఇందులో భాగంగా ఇంటి చిట్కాలు..  అందరికీ అందుబాటులో ఉండే  త్రిఫల, చ్యవనప్రాష్, అశ్వగంధ, మేదోహర్ గుగ్గులు మొదలైన కొన్ని ఆయుర్వేద మందులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని కూడా తప్పు మార్గంలో తీసుకుంటే వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఆయుర్వేద మందులను సరైన పద్ధతిలో తీసుకోవడం అంటే  ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. ప్రకృతిని (మనస్సు, శరీర నిర్మాణం) సరిగ్గా అంచనా వేసి, రుగ్మతకు కారణాన్ని తెలుసుకున్న తర్వాత సరైన సమయంలో, సరైన నిష్పత్తిలో.. తేనె, గోరువెచ్చని నీరు, మజ్జిగ మొదలైన సరైన అనుపానంతో లేదా ఇతర పద్దతులలో ఆయుర్వేద మందులను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలామంది వీటిని స్వంతంగా కొనుగోలు చేసి లేని సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు.

అసలు తప్పుగా వాడటం అంటే ఏంటి?

 చాలామంది వార్తాపత్రికలో/గూగుల్‌లో ఒక సమస్య  గురించి దానికి సంబంధించిన ఔషధం గురించి చదివి ఆ మందులు తమకు కూడా బాగా పనిచేస్తాయని సొంతంగా వాడటం చేస్తారు. నిజానికి ఇలా వాడే మందులు కొందరికి పని చేయవచ్చు.  కానీ అది శరీర తత్వం,  శరీరం లో ఉన్న వ్యాధి పరిస్థితిని బట్టి పనిచేస్తుంది.  కానీ జబ్బు అనేది అందరికీ ఒకే తీవ్రతలో ఉండదు. ఈ కారణంగా మందులను తప్పుగా తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల జబ్బు తగ్గడం మాట అటుంచితే.. దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఆయుర్వేదం "అందరికీ ఒకే పరిమాణం సరిపోతుంది" అనే సూత్రంపై పనిచేయదు.  'వ్యక్తిగతీకరణ' సూత్రంపై పనిచేస్తుంది.  ప్రతి మనిషి ఇంకొక మనిషి కంటే ప్రత్యేకంగా ఉంటాడు.  అలాంటప్పుడు  చికిత్స కూడా ఒకే విధంగా ఉండదు అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఆయుర్వేద మందులను కూడా స్వంతంగా వాడటం మంచిది కాదు.


                                    *రూపశ్రీ.


గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.