ఆయుర్వేదం మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మందికి తెలియని నిజాలివి..!

Publish Date:Feb 7, 2025

Advertisement

 

భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రజలు  ఆయుర్వేద చికిత్సపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిజానికి ఒకప్పుడు ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేద వైద్యమే జరిగేది. అయితే అల్లోపతి వైద్యం విస్తృతంగా వ్యాప్తి చెందాక ఆయుర్వేద వైద్యం ఆదరణ తగ్గింది. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఫలితాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఆయుర్వేదం  ఏ జబ్బును అయినా నిర్మూలిస్తుంది.  శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. కానీ అల్లోపతి శరీరాన్ని మత్తులోకి నెడుతుంది. చాలా రకాల జబ్బులను తాత్కాలికంగా మాత్రమే నయం చేయగలుగుతుంది.  అల్లోపతి వల్ల పెద్ద పెద్ద జబ్బులు నయం అయినా శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది.  దీన్ని అర్థం చేసుకున్న ప్రజలు తిరిగి ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తున్నారు.  ఆయుర్వేదంలో  చిన్న చిన్న జబ్బుల నుండి అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స సాధ్యమవుతుంది. అలాగే డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆయుర్వేద చికిత్సపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఆయుర్వేదం అనేది శరీరం, మనస్సు, ఆత్మ,  పర్యావరణం మధ్య సమతుల్యతను ప్రోత్సహించే భారతదేశ సాంప్రదాయ వైద్య విధానం. ఈ వైద్య విధానంలో మూలికలు, మొక్కలు, పువ్వులు,  పండ్లతో తయారు చేసిన మందులను వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో మసాజ్, యోగా,  ధ్యానం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఆయుర్వేదం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని  చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజంగా నిజమేనా? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు దీని గురించి సమాచారం సరైన సమాధానం అందించారు. ఆయుర్వేద మందులకు నిజంగా దుష్ప్రభావాలు లేవా లేదా అది కేవలం అపోహనా అనే విషయం తెలుసుకుంటే..

ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఆయుర్వేద  మందులకు కూడా దుష్ప్రభావాలు ఉంటాయి.   కానీ వైద్యుల సలహా మేరకు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.   డాక్టర్ల ప్రకారం భారతదేశంలో  డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మందులను కొనుగోలు చేసి  వాడుతుంటారు.  ఇందులో భాగంగా ఇంటి చిట్కాలు..  అందరికీ అందుబాటులో ఉండే  త్రిఫల, చ్యవనప్రాష్, అశ్వగంధ, మేదోహర్ గుగ్గులు మొదలైన కొన్ని ఆయుర్వేద మందులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని కూడా తప్పు మార్గంలో తీసుకుంటే వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఆయుర్వేద మందులను సరైన పద్ధతిలో తీసుకోవడం అంటే  ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. ప్రకృతిని (మనస్సు, శరీర నిర్మాణం) సరిగ్గా అంచనా వేసి, రుగ్మతకు కారణాన్ని తెలుసుకున్న తర్వాత సరైన సమయంలో, సరైన నిష్పత్తిలో.. తేనె, గోరువెచ్చని నీరు, మజ్జిగ మొదలైన సరైన అనుపానంతో లేదా ఇతర పద్దతులలో ఆయుర్వేద మందులను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలామంది వీటిని స్వంతంగా కొనుగోలు చేసి లేని సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు.

అసలు తప్పుగా వాడటం అంటే ఏంటి?

 చాలామంది వార్తాపత్రికలో/గూగుల్‌లో ఒక సమస్య  గురించి దానికి సంబంధించిన ఔషధం గురించి చదివి ఆ మందులు తమకు కూడా బాగా పనిచేస్తాయని సొంతంగా వాడటం చేస్తారు. నిజానికి ఇలా వాడే మందులు కొందరికి పని చేయవచ్చు.  కానీ అది శరీర తత్వం,  శరీరం లో ఉన్న వ్యాధి పరిస్థితిని బట్టి పనిచేస్తుంది.  కానీ జబ్బు అనేది అందరికీ ఒకే తీవ్రతలో ఉండదు. ఈ కారణంగా మందులను తప్పుగా తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల జబ్బు తగ్గడం మాట అటుంచితే.. దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఆయుర్వేదం "అందరికీ ఒకే పరిమాణం సరిపోతుంది" అనే సూత్రంపై పనిచేయదు.  'వ్యక్తిగతీకరణ' సూత్రంపై పనిచేస్తుంది.  ప్రతి మనిషి ఇంకొక మనిషి కంటే ప్రత్యేకంగా ఉంటాడు.  అలాంటప్పుడు  చికిత్స కూడా ఒకే విధంగా ఉండదు అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఆయుర్వేద మందులను కూడా స్వంతంగా వాడటం మంచిది కాదు.


                                    *రూపశ్రీ.


గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.