కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై పోలీసులు కేసు

మహిళా పోలీసులపై దాడి ఘటనలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఒడిశా అసెంబ్లీ ముట్టడి సందర్భంగా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళా పోలీసులతో సహా 60 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను జగదీష్ రెచ్చగొట్టారంటూ పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. మరో కాంగ్రెస్ నేత నిరంజన్ పట్నాయక్‌పైనా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.