మరో వైసిపి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. చెన్నైలో ట్రీట్ మెంట్

ఎపి లో కరోనా తీవ్రమవుతోంది. అటు సామాన్యుల నుండి ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా చుట్టబెట్టేస్తోంది. రాష్ట్రంలో ఇటు పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతోంది. నిన్న ఒక రోజు లోనే 1935 పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్ననే ఎపి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అయన భార్య, కుమార్తెలకు పాజిటివ్ అని తేలింది. దీంతో అందరు చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. 

తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనారోగ్యంగా ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో అయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఓ పోలీస్ స్టేషన్‌కూడా కరోనా వైరస్ కారణంగా మూసివేశారు. తాజాగా రాష్ట్రంలో 30 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... ఇప్పటివరకూ మొత్తం 16,464 మంది డిశ్చార్జి అయ్యారు.