భారత్ లో తొమ్మిది లక్షల కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తొమ్మిది లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో భారత్ లో 28,498 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,06,752కి చేరింది. గత 24 గంటల్లో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో, మొత్తం మృతుల సంఖ్య 23,727కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,11,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి.