ఘోర ప్రమాదం.. 10 మంది మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వారణాసి వైపు వెళుతున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెడుతున్న ట్రాక్టర్ ను మీర్జాపూర్‌ సమీపంలో ట్రక్కు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో పది మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.