పురుషుల పొంగళ్ వేడుక.. ఎక్కడంటే?

ఆలయాల్లో జాతర్లు, తిరునాళ్లు జరిగితే,  మహిళలు పొంగళ్ళు పెట్టడం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి కడప జిల్లాలోని ఒక ఆలయంలో వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఆలయంలో పురుషులు పొంగళ్లు పెడతారు.   ఔను ఇక్కడి ఆచారం ప్రకారం ప్రతి ఏటా   సంక్రాంతికి ముందు సంజీవరాయ స్వామికి మగవాళ్ళు పొంగళ్ళు పెట్టి మొక్కలు తీర్చుకుంటారు. మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదు.

ఆలయంలో పెట్టిన నైవేద్యం కూడా మహిళలు ముట్టుకోరు. మగవాళ్ళేతింటారు.  ఉమ్మడి కడప జిల్లా  పుల్లంపేట మండలం తిప్పారు పల్లెలో ఈ  ఆచారం ఉంది.  ప్రస్తుతం ఈ పుల్లంపేట తిప్పారుపల్లె గ్రామం తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ మగవారి పొంగళ్ల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ఆచారం ప్రకారం శ్రీ సంజీవరాయ స్వామికి మగవారే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొంగళ్ళు పెట్టారు. ఈ  పురుషుల  పొంగళ్ల వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.  ఏటా సంక్రాంతికి ముందు వచ్చే

ఆదివారం   సంజీవరాయునికి పొంగళ్లు పండుగను   సంక్రాంతి కంటే  ఘనంగా జరుపుకొంటారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu