సుధీర్ కన్నుమూత..సినీ రంగంలో విషాదం

భారతీయ సినీ రంగంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ దర్శకుడు అకాల మరణం చెందాడు. 

సుధీర్ బోస్(sudheer bose)..మలయాళ సినీ రంగంలో తిరుగులేని దర్శకుడు. కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురవ్వడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. చాలా రోజుల నుంచి అక్కడే ఉంది  ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. చివరకి పరిస్థితి విషమించడంతో  సోమవారం చికిత్స పొందుతు కన్ను మూసారు. ఆయన వయసు ప్రస్తుతం యాభై మూడు సంవత్సరాలు.  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కళాభవన్ మణి, ముఖేష్, రంభ ప్రధాన పాత్రల్లో నటించిన 'కబడ్డీ కబడ్డీ' దర్శకుడు గా మంచి పేరుని తీసుకొచ్చింది. సుధీర్  మృతికి మలయాళ సినీ రంగానికి చెందిన  పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని  తెలియచేసారు.