సాయి ట్రస్టులో వెలుగుచూస్తున్న నిజాలు

అనంతపురం: జిల్లాలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద శనివారం పట్టుబడిన డబ్బు సత్యసాయి ట్రస్టుదే అనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పెనుకొండ డీఎస్పీ కృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి ట్రస్టు సభ్యులు చెప్పినట్లు ఎవరూ డబ్బు కోసం తమ వద్దకు రాలేదని వెల్లడించారు. పట్టుబడిన సొమ్మంతా 12 మంది సత్యసాయి భక్తులకు సంబంధించిన మొత్తమని, ఆధారాలతో వారు పోలీసులకు  వివరిస్తారంటూ ట్రస్టు సభ్యుడు రత్నాకర్ ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. 

 

కాగా, డబ్బు తరలిస్తూ పట్టుబడిన డ్రైవర్ హరీష్ నందాను ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతన్ని పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరు పరిచారు. నందా సత్య సాయి ట్రస్టు డ్రైవరేనని తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. 35 లక్షల రూపాయలను తరలిస్తూ నందా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డాడు.