తొక్కిసలాట.. 121 మంది మృతి!

ఉత్తర్ ప్రదేశ్‌లోని హథ్‌రాస్‌లో పెను విషాదం జరిగింది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరగడంతో దాదాపు 121 మందిమరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.రతిభాస్‌పూర్‌లో శివారాధన కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. చనిపోయిన, గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువమంది వున్నారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.