భారత్ లో గూగుల్ భారీ పెట్టుబడులు

సెర్చ్ ఇంజన్ 'గూగుల్‌' భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. 'డిజిటైజేషన్‌ ఫండ్‌' కింద రూ.75 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన 'డిజిటల్ ఇండియా'ను సాకారం చేసేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు. భారత్ లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి తమ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.