తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (జులై 2)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.  సోమవారం (జులై 1) శ్రీవారిని మొత్తం 75 వేల 449 మంది దర్శించుకున్నారు.

వారిలో 27వేల 121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 91 లక్షల రూపాయలు వచ్చింది.