రోజువారీ విచారణకు జగన్ కేసులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం బుధవారం నాడు సంభవించింది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో వున్న జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులపై హరిరామజోగయ్య గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలను వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.