అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకి జగన్ హాజరు
posted on Feb 4, 2015 2:00PM
.jpg)
అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అన్ని చార్జ్ షీట్లలో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయనపై ప్రస్తుతం మొదటి మూడు చార్జ్ షీట్లలో సీబీఐ చేసిన ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిత్ బాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు కూడా బుధవారం నాడు జరిగిన విచారణకు హాజరయ్యారు. వారు ఈ కేసుల విచారణకు హాజరయినప్పుడు తమను ఈ కేసుల నుండి విముక్తి చేయమని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు. వాటిని స్వీకరించిన కోర్టు ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసు విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ 11 చార్జ్ షీట్లపై విచారణ పూర్తవడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో, అంతిమంగా ఎటువంటి తీర్పు వస్తుందో తెలియడం లేదు. బహుశః మరో నాలుగేళ్లయినా పడుతుందేమో?