ఆ మూడు కేసులూ సీఐడీకి..!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కీలకమైన కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు నంబర్-1.. చంద్రబాబు ఇంటి మీద వైసీపీ గూండాలు దాడి చేసిన కేసు.. కేసు నంబర్-2... తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ గూండాలు దాడి చేసిన కేసు. కేసు నంబర్-3... ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు. ఈ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ పోలీస్ బాస్ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు.