జూన్ 21న 'అంతిమ తీర్పు'...

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అంతిమ తీర్పు'. ఎ. అభిరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి. రాజేశ్వరరావు నిర్మించారు.

ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. సాయి ధన్సిక ఒక గృహిణిగా ఈ సినిమాలో కనిపించబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎం.అభిరాం, సంగీత దర్శకుడు కోటి పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపారు. 

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'అంతిమ తీర్పు' చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని, సాయి ధన్సిక నటన సినిమాకు మెయిన్ హైలెట్ కానుందని నిర్మాత డి.రాజేశ్వరరావు అన్నారు.