తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. సోమవారం (జులై1) ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఆదివారం (జూన్ 30) శ్రీవారిని 81, 005 మంది దర్శించుకున్నారు.

వారిలో 28. 244 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 94లక్షల రూపాయలు వచ్చింది.