కేసీఆర్ పిటిషన్ కొట్టేసిన కోర్టు!

బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్‌ని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టేసింది. కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద కేసీఆర్ న్యాయవాది చేసిన వాదనతో హైకోర్టు ధర్మాసనం విభేదించింది. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కి విచారణార్హత లేదని అన్నారు. అడ్వకేట్ జనరల్ వాదనలను హైకోర్టు సమర్థించింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ, విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని పేర్కొంది.