ఏపీలో దసరా సెలవులు రెండు రోజులు అదనం

ఆంధ్రప్రదేశ్ లో  స్కూళ్లకు ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. అంటే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు నుంచే ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన చేసిన ఓ పోస్టులో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రంలో దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.  వాస్తవానికి విద్యాశాఖ ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ మేరకు రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా సెలవులు ఉండాలి. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దసరా సెలవురు రెండు రోజులు పెరిగాయి.  అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలుహర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu