నెలరోజులపాటు జాజికాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి. ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు. కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి. దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు. శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది. *రూపశ్రీ.
read moreపిసిఓయస్ దేశంలో ప్రతి 5వ మహిళకు ఉన్న సమస్య.. జాగ్రత్త తీసుకోకపోతే ముప్పు తప్పదా?
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలను ప్రభావితం చేసే చాలా సాధారణ సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు అందరూ దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సరిగా రాకపోవడం, అండాశయంలో తిత్తులు వంటి సమస్యలను కలిగి ఉంటుంది. దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది మహిళలు పిసిఒఎస్ గురించి, దాని వల్ల వచ్చే సమస్యలను బహిరంగంగా చెప్పలేకపోతుంటారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం భారతదేశంలోనే ప్రతి ఐదుగురు కౌమారదశలో ఉన్న మహిళల్లో ఒకరు PCOSతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని అంచనా 6% నుండి 21% మధ్య ఉంటుంది. ఒక అధ్యయనంలో నిపుణులు PCOS వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి దీనికి చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తి లేదా మెదడు సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. పిసిఓయస్.. PCOS వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకునే ముందు పిసిఓయస్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం..! పిసిఒఎస్ అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో వచ్చే వ్యాధి. హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఈ సమస్యలో ఋతు చక్రం ప్రభావితమవుతుంది. ఇందులో పీరియడ్స్ అస్సలు జరగవు లేదా చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది కాకుండా ఈ వ్యాధిలో అండాశయాల వెలుపలి అంచున ద్రవాలతో నిండిన చిన్న తిత్తులు ఉండవచ్చు. వీటిని సిస్ట్ లు అని అంటారు. PCOS యొక్క దీర్ఘకాలిక సమస్య. ఇది గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ముప్పులు తప్పవా? 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ సమస్య మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది. PCOS ఉన్న స్త్రీలకు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం, మధ్య వయసులో ఆలోచనా సామర్థ్యంలో మార్పులు ఎక్కువగా ఉంటాయట. ఇది జీవిత నాణ్యత, కెరీర్, ఆర్థిక భద్రతతో సహా అనేక విధాలుగా స్త్రీలను ప్రభావితం చేస్తుంది. పిసిఓయస్ ఉన్న మహిళలలో ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం, అది కాస్తా అధిక బరువుకు కారణం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి కారణంగా ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. *రూపశ్రీ.
read moreఎక్కువ కాలం జీవించాలంటే ఇప్పుడే ఈ 5 మార్పులు చేసుకోండి..!
ఎప్పుడైనా పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. మనిషి ఆయుష్షు వందేళ్లు అని చెబుతారు. ఒకప్పటి మహర్షులు, ఋషులు వందల ఏళ్లు జీవించగలిగారు. తరువాత మన ముత్తాతలు, తాతలు వందేళ్ళకు పైగానే జీవించారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ కాలమే ఉంటున్నా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని బట్టి చూస్తే.. క్రమంగా మనిషి ఆయుష్షు తగ్గుతూ వస్తోందని చెప్పవచ్చు. పరిశోధనలతో పాటు.. సమాజంలో జరుగుతున్న మరణాల రేటు, మరణాల వివరాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే వెంటనే జీవితంలో 5 మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుంటే. సమతుల ఆహారం.. ఆహారమే ఆరోగ్యం అని అంటారు. చాలా వరకు తీసుకునే ఆహారమే ఔషదంగా పనిచేసి చాలా రోగాలు నయం కావడంలో సహాయపడుతుంది. రోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరానికి శక్తి కూడా అందుతుంది. రోజులో కనీసం 5రకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలట. గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ తో పాటూ అవసరమైన పోషకాలు, ప్రోటీన్ కూడూ ఉంటుంది. ప్రోటీన్ కోసం చేపలు, శనగలు, పప్పులు, జున్ను, పనీర్ వంటివి తినాలి. ఇవన్నీ శరీరానికి తగిన బలాన్ని ఇస్తాయి. శరీరంలో కండరాలను బలంగా ఉంచుతాయి. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి వీలైనంత తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవాలి. చక్కెర జోడించి చేసిన ఆహారం, ఉప్పు ఎక్కువ జోడించి చేసిన ఆహారం తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ లో సోడియం, చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలు, ఆలివ్ నూనె, చేపలు తినాలి. ఇవి మెదడుకు కూడా చాలా సహాయపడతాయి. వ్యాయామం.. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయవచ్చు. నిద్ర.. కనీసం 7 నుండి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి.. జీవితంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి లేకుండా చూస్తూ ఏ సమస్య అయినా చాలా తొందరగానే పరిష్కారం అవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఒత్తిడే.. ద్యానం, శ్వాస వ్యాయామాలు, యోగ వంటివి ఫాలో అయితే ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. నీరు.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి నీరు చాలా అవసరం. శరీరం హైడ్రేటెట్ గా ఉండాలన్నా, శరీరంలో వ్యర్ఖాలు బయటకు వెళ్లిపోవాలన్నా రోజూ తగినంత నీరు తాగుతుండాలి. దీని వల్ల శరీరానికి సరైన శక్తి లభిస్తుంది. *రూపశ్రీ.
read moreవిటమిన్-డి లోపిస్తే డిప్రెషన్ వస్తుందా?
శరీరానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్లలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆహారం నుండి లభిస్తాయి. కొన్ని ఆహారం తీసుకున్న తరువాత శరీరంలో విటమిన్ గా రూపాంతరం చెందుతాయి. కానీ విటమిన్-డి మాత్రం అలా కాదు.. ఇది ఎక్కువగా సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. చాలామంది ఉదయాన్నే సూర్యుడి లేత కిరణాలలో కనీసం 10 నుండి 30 నిమిషాల వరకు గడపాలి అని చెప్పడం వెనుక కారణం ఇదే.. అయితే నేటి జీవనశైలి, బిజీ జీవితాలు, గదులలోనే కూర్చుని ఉద్యోగాలు చేయడం వంటి కారణాల వల్ల విటమిన్-డి లభించడం కష్టం అవుతుంది. అందునా చలికాలంలో సూర్య కాంతి మరీ ప్రభావవంతంగా ఉండదు. ఈ కారణంగా కూడా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అయితే.. విటమిన్-డి లోపం వల్ల డిప్రెషన్ సమస్య వస్తుందని అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఎవరైనా సరైన కారణాలు లేకుండా డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టైతే అది విటమన్-డి లోపం కారణంగా వచ్చిన సమస్య కావచ్చని అంటున్నారు వైద్యులు. విటమిన్-డి ఎముకలకు మాత్రమే కాదు.. మెదడు సరైన పనితీరుకు కూడా చాలా ముఖ్యం. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ ను ఉత్పత్తి చేసేది విటమిన్-డి నే.. దీవినల్లే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. విటమిన్-డి మెదడులోని సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని నియంత్రిస్తుంది. తద్వారా మెదడు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. అంతేనా.. మెదడులో ఆందోళన కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో కూడా విటమిన్-డి సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితికి ఇంత అవసరమైన విటమిన్-డి లోపం ఏర్పడితే సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక పరిస్థితి అప్పటికే సరిగా లేని వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. విటమిన్-డి లోపిస్తే ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండవు. దీని వల్ల ఎప్పుడూ నిరాశ, నిర్లక్ష్యం, చిరాకు, అసహనం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-డి లోపం ఏర్పడే వారిలో డిప్రెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్యుడి లేత కిరణాలలో సమయం గడపడం, చేపలు, గుడ్లు, విటమిన్-డి కలిగిన పాలు.. వంటి ఇతర పదార్థాలు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. శీతాకాలంలో విటమిన్-డి అంతగా లభ్యం కాదు కాబట్టి ఈ సీజన్ లో విటమిన్-డి కోసం చేపలు, గుడ్లు, పాలు బాగా తీసుకోవాలి. *రూపశ్రీ.
read moreనెలరోజుల పాటు ఒక గ్లాస్ మెంతి గింజల నీరు తాగితే ఏమవుతుందంటే..!
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకుకూరల పెంపకానికి విత్తనాలే మూలం. అయితే అన్ని విత్తనాలను నేరుగా తీసుకోలేం. ముఖ్యంగా మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మెంతికూరనే కాకుండా మెంతి గింజలను కూడా ఆహారంలో వాడతారు. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టినప్పుడు, దానిలోని పోషకాలు నీటిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మెంతులు ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నెల రోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతుల నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. మెంతి నీరు.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతి గింజలు వేసి మూత పెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇలా రోజూ ఒక నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.. మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెల రోజుల పాటు రోజూ మెంతి నీరు తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతి కూరలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడం సులభం.. మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మెంతి నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి శరీరంలో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి . నెల రోజుల పాటు రోజూ ఒక గ్లాసు మెంతికూర నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చక్కెర స్థాయి నియంత్రణ.. మెంతికూరలో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యం.. మెంతికూరలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తపోటును అదుపు చేయడంలో మెంతి నీరు కూడా ఎంతగానో సహకరిస్తుంది. చర్మం మరియు జుట్టుకు.. మెంతికూరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం-జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు మొటిమలు, మచ్చలను తొలగించి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో కూడా మెంతి నీరు సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreనకిలీ నెయ్యిని 2 నిమిషాల్లో గుర్తించే సూపర్ టిప్ ఇదీ..!
నెయ్యి ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం. ప్రతి రోజూ స్వచ్చమైన నెయ్యిని కనీసం ఒక స్పూన్ అయినా తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిదని చెబుతారు. ముఖ్యంగా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. గర్భంతో ఉన్నవారు నీటిలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగుతుంటారు. దీని వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచిదని చెబుతారు. అయితే నెయ్యి స్వచ్చమైనది అయితేనే దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కల్తీ నెయ్యి వాడితే మాత్రం దాని వల్ల కలిగే ప్రయోజనాలకంటే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. తాజాగా కిలోల కొద్దీ నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరం బయటపడటంతో నెయ్యి విషయంలో చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో కల్తీ నెయ్యని 2 నిమిషాలలో ఎలా గుర్తించవచ్చో ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ కమీషన్ హర్యానాలోని జింద్ నగరంలో దాడి చేసి నకిలీ దేశీ నెయ్యిని తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కనుగొంది. ఈ ఆపరేషన్లో 1925 కిలోల నకిలీ నెయ్యి, 1405 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగిని ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. గోదాములో రంగులు, రసాయనాలు కూడా కనిపించాయని చెబుతున్నారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనే రసాయనాన్ని జోడించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారట. భారతదేశంలో చాలా చోట్ల నకిలీ నెయ్యి, నూనె, పాలు మొదలైనవి తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? నెయ్యి లో కూరగాయల నూనె కలుపుతారు. చౌకైన కూరగాయల నూనె లేదా కూరగాయల ఫ్యాట్ ను నిజమైన నెయ్యితో కలపడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. దీని వినియోగం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బులు, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి కల్తీ నెయ్యి దీర్ఘకాలిక వినియోగం వల్ల ధమనులను అడ్డుకోవడానికి దారితీస్తుంది. స్టార్చ్.. నెయ్యి పరిమాణాన్ని పెంచడానికి పిండిని కలుపుతారు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, బరువు పెరుగుట, జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది. నకిలీ నెయ్యిలో ఉండే రసాయనాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. నకిలీ నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్, హానికరమైన నూనెలు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్ లేదా మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నెయ్యి కల్తీని ఇలా గుర్తించవచ్చు.. ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక మి.లీ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి. అందులో ఒక మిల్లీ.. Conc.HCLని జోడించండి ఆ తర్వాత అందులో అర చెంచా చక్కెర వేయాలి. రెండు నిమిషాలు బాగా షేక్ చేయాలి. నెయ్యిలో కల్తీ లేకపోతే దాని రంగు మారదు. నెయ్యి నకిలీ అయితే దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు. *రూపశ్రీ.
read moreచలికాలంలో అరటిపండ్లు తినడం మంచిది కాదా?
చలికాలంలో తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది. రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది. అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది. ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ చాలా తియ్యగా మారుతుంది. ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ.
read moreచలికాలంలో ఈ తప్పులు చేశారంటే.. గుండ్రాయిలా మారిపోతారు జాగ్రత్త..!
సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి, ఆహార వేళలు, శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది. దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది. ఈ కారణాల వల్ల ఇంటి పనులు, ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు. పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు, సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది. దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు, సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు. దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఏర్పడతాయి. దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. *రూపశ్రీ.
read moreచలికాలంలో అల్లం టీ.. లాభాలే కాదు ఈ నష్టాలు కూడా..!
చలికాలం శరీరానికి పరీక్ష కాలం. చాలామంది శరీరం వెచ్చగా ఉండటం కోసం ఆహారంలో చాలా మార్పులు చేసుకుంటారు. అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి ఔషద మూలికలు కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, సీజన్ సమస్యలు తగ్గించడంలో బాగా సహాయపడుతుందని అంటారు. చలి నుండి ఊరట పొందడానికి చాలామంది టీ, కాఫీలు బాగా తాగుతారు. ముఖ్యంగా చలికాలంలో అల్లం టీ తాగడానికి చాలమంది ఇష్టపడతారు. అయితే అల్లం టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. అల్లం టీ తాగడం చాలా రిలీఫ్ గా అనిపించినప్పటికీ ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజులో ఒకటి లేదా రెండు సార్లకు మించి అల్లం టీ తాగితే యాసిడ్ చాలా ఎక్కువ పెరిగి ఎసిడిటీ సమస్య విజృంభిస్తుంది. ఇప్పటికే ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు అల్లం టీ ఒకటి లేదా రెండు సార్లకు మించి తాగితే అది సమస్యను తీవ్రం చేస్తుంది. అల్లంలో రక్తపోటు సమస్యకు మంచి ఔషధం. అధిక రక్తపోటును నియంత్రించడంలో, తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇప్పటికే రక్తపోటు తక్కువ వారు అల్లం టీని పదే పదే తాగుతుంటే అది శరీరంలో రక్తపోటు తగ్గిపోయి లో బీపీ, మైకం వంటి సమస్యలు కలుగజేస్తుంది. రక్తం శరీరంలో చాలా కీలకమైన ద్రవ పదార్థం. అయితే అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి. ఇప్పటికే రక్తం పలుచన కావడం కోసం మందులు వాడుతున్న వారు అల్లం టీ తాగితే చాలా సమస్య ఏర్పడుతుంది. గర్భవతులకు వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అజీర్ణం కూడా చేస్తుంటుంది. అయితే అల్లం టీ తాగితే ఈ సమస్య చాలా వరకు సద్దుమణుగుతుంది. కానీ ఇది మేలు చేస్తుంది కదా అని పదే పదే అల్లం టీని తాగితే గర్భవతులకు మేలు కంటే ఎక్కువ కీడు జరిగే అవకాశం ఉంది. అల్లం టీ తాగితే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కడుపులో వికారం కలిగించి అతిసారం సమస్య సృష్టిస్తుంది. అల్లంలో టానిన్ లు ఉంటాయి. అలాగే అల్లంటీలో కెఫీన్ కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తాగితే తీసుకునే ఆహారం నుండి ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని వల్ల ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత సమస్య వస్తుంది. *రూపశ్రీ.
read moreఆహారమే కాదు.. ఎసిడిటీకి ఇవి కూడా కారణాలేనట..!
ఎసిడిటీ అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎసిడిటీ సమస్యను అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసిడిటీ కారణంగా అజీర్ణం, జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎసిడిటీని ప్రధానంగా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు. అయితే దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వచ్చే సమస్య ఎసిడిటీ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడినప్పుడు యాసిడ్ ఆహార నాళంలోకి తిరిగి వస్తుంది. దీని కారణంగా ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంట వస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఎసిడిటీ రావచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎసిడిటీకి ప్రధాన కారణమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కాకుండా, ఎసిడిటీని కలిగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ రావడానికి ఆహారం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమున్నాయి? కడుపులో ఉండే యాసిడ్ (గ్యాస్ట్రిక్ జ్యూస్) అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ కడుపు ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు గోడలలో విచ్చలవిడిగా వ్యాపించడం జరిగినప్పుడు అది కడుపులో మంట, నొప్పి, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసిడిటీ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇవి కూడా తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల వరకు ఉంటాయి. తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపు మండే అనుభూతి కలిగి ఉంటుంది. త్రేనుపులు బాగా వస్తాయి ముఖ్యంగా పుల్లని త్రేనుపులు ఎక్కువ ఉంటాయి. తరచుగా నోటిలో పుల్లని రుచి ఉంటుంది. కడుపులో భారం, నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎప్పుడూ అనిపిస్తుంటాయి. గొంతులోకి యాసిడ్ చేరడం వల్ల మంట, పొడి దగ్గు. వికారం, వాంతులు లేదా తరచుగా రెగ్యురిటేషన్ ఆహారమే కారణమా? ఆహార సంబంధిత అలవాట్లు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన కారంగా, వేయించిన ఆహారాన్ని తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఎసిడిటీకి ప్రధాన కారణాలు. తిన్న వెంటనే పడుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎక్కువ సేపు ఆకలితో ఉండడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ రావచ్చు. ఇవి కూడా కారణాలే.. తినే అలవాట్లతో పాటు అనేక జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కూడా ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యం సేవించే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా అధిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నా.. తగినంత నిద్ర లేకున్నా.. లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపుతో , ఉన్నా ఎసిడిటీకి గురవుతారు. *రూపశ్రీ.
read moreవెయ్ ప్రోటీన్ మార్కెట్లో కొనక్కర్లేదు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు!
ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా ఈ మద్యకాలంలో శారీరక స్పృహ, ఆరోగ్య స్పహ పెరగిన కారణంగా ప్రోటీన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రోటీన్ లోపం ఉండకూడదని చాలామంది ప్రోటీన్ పౌడర్లు కూడా వాడుతుంటారు. దీనికి తగ్గట్టే ప్రోటీన్ పౌడర్ ఉత్పత్తులు చాలా విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వెయ్ ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. వెయ్ ప్రోటీన్ అంటే పాటవిరుగుడుతో తయారుచేస్తారు.మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ వాడటం మంచిదేనా? దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవ్చచు? తెలుసుకుంటే.. మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ చాలా ఖరీదుగా ఉంటుంది. అయితే ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ వెయ్ ప్రోటీన్ కూడా బాడీ బిల్డింగ్ చేసేవారు, అధికంగా వ్యాయామాలు చేసేవారికి అవసరం. జిమ్ కు వెళుతూ వెయ్ ప్రోటీన్ ను వాడిన 19 ఏళ్ల కుర్రవాళ్లు కిడ్నీ ఫెయిల్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో లభించే వెయ్ ప్రోటీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా చాలా రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని చాలా దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ అవసరమే కానీ బాడీ బిల్డర్లకు అవసరమైనంత మాత్రం అవసరం లేదు. అందుకే వెయ్ ప్రోటీన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం సురక్షితం అంటున్నారు పోషకాహార నిపుణులు. పాలు.. పాలు తాగడం వల్ల చాలావరకు వెయ్ ప్రోటీన్ లభిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ పాలు తాగాలని అది ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. పాలలో దాదాపు 80శాతం పైన కేసైన్ ప్రోటీన్, 20శాతం వెయ్ ప్రోటీన్ ఉంటుంది. వెయ్ ప్రోటీన్.. పాల విరుగుడుతో చేసే ప్రోటీన్ నే వెయ్ ప్రోటీన్ అంటారు. అయితే దీన్ని ఇంట్లో కూడా తీసుకోవచ్చు. పాలను మొదటగా జున్నులాగా చేయాలి. దీని నుండి పన్నీర్ వస్తుంది. పన్నీర్ ను వేరు చేసిన తరువాత నీరు మిగిలిపోతాయి. చాలామంది ఈ నీటిని పడేస్తుంటారు. కానీ వెయ్ ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది. పాలలో ఉండే కేసైన్ ప్రోటీన్ పన్నీర్ లోకి వెళ్లిపోతుంది. పాలలో ఉండే వెయ్ ప్రోటీన్ ఈ నీటిలో ఉంటుంది. ఈ నీటిని పారబోయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. వెయ్ ప్రోటీన్ కండరాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది శరీర బరువును పెంచుతుంది, బలాన్ని పెంచుతుంది. కొన్ని పరిశోధనలలో, ఇది అధిక BP మరియు మధుమేహాన్ని నియంత్రించగలదని కూడా కనుగొనబడింది . ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. *రూపశ్రీ.
read more50రూపాయలకు దొరికే ఈ వస్తువులతో వారం రోజుల్లోనే థైరాయిడ్ నయం..!
థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు వైద్యులను రెగ్యులర్ గా కలుస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా కొందరు వైద్యులు థైరాయిడ్ అనేది నయం కాదని, దీనికి అలా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండాలని అంటారు. దీనికి తగ్గట్టే ప్రతిరోజూ 25, 50, 75 mg మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మందులను తీసుకున్న తర్వాత బాగా అలసిపోతారు. ఇవి సమస్యను నయం చేయకపోగా హాని ఎక్కువ కలుగుతుంది. కానీ ఆయుర్వేదం మాత్రం 50 రూపాయల ఖర్చు పెట్టి వారం రోజుల్లో థైరాయిడ్ ను మట్టుబెట్టవచ్చని చెబుతోంది. లక్షణాలు.. థైరాయిడ్ అనేది ఒక సాధారణ సమస్య. దీనిలో థైరాయిడ్ అని పిలువబడే హార్మోన్ తక్కువ లేదా ఎక్కువ ఉత్పత్తి కావడం జరుగుతుంది. దీని కారణంగా అలసట, బలహీనత, బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, మలబద్ధకం, మెడ నొప్పి, వాపు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. నొప్పి, ఆందోళన, భయము, హృదయ స్పందన వేగంగా ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం, వాపు, కళ్లు ఎర్రదా ఉండటం లేదా ఉబ్బినట్టు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ కు చెక్ పెట్టే మార్గం.. కావసిన పదార్థాలు.. నల్ల మిరియాలు .. 50 గ్రాములు పిప్పళ్లు.. 50 గ్రాములు ఎండు అల్లం.. 50 గ్రాములు తయారీ విధానం.. పైన చెప్పుకున్న పదార్థాలు అన్నింటిని బాగా గ్రైండ్ చేయాలి. ఇది మెత్తని పొడిలాగా ఉండాలి. ఈ చూర్ణాన్ని ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తర్వాత నీటితో ఒక చిటికెడు తీసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే కేవలం 7రోజుల్లోనే థైరాయిడ్ సమస్య నార్మల్ గా ఉందని రిపోర్ట్ కూడా వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మరిన్ని లాభాలు.. పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే ఊబకాయం కూడా తగ్గుతుందట. సాధారణంగా థైరాయిడ్ ఉన్నవారిలో అధిక బరువు ఉంటుంది. పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే అధిక బరువు, బలహీనత లక్షణాలు కూడా తగ్గుతాయి. *రూపశ్రీ.
read moreముల్లంగి చాలా పవర్ఫుల్ కానీ.. 90శాతం మంది తప్పు పద్దతిలో తింటున్నారట..!
ముల్లంగి చాలా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. నీటి శాతం అధికంగా ఉండే ఈ కూరగాయ తినడం వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు మంత్రించినట్టు మాయమవుతాయి. శీతాకాలపు రోజుల్లో ముల్లంగి కూరగాయలు సమృద్ధిగా పండుతాయి. వీటిని ఎక్కువగా తినే కాలం కూడా శీతాకాలమే.. చాలామంది ముల్లంగి వాసనను ఇష్టపడరు. కానీ ఇతర రాష్టాలలో ముల్లంగిని కీర దోస లాగా చక్రాలుగా కట్ చేసుకుని తింటారు. కానీ చాలామందికి ముల్లంగిని ఎలా తినాలో క్లియర్ గా తెలియదట. ముల్లంగిలో పోషకాల గురించి, దాన్ని ఎలా తినాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు ముల్లంగిలో 17.2 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ముల్లంగిలో కాల్షియం, విటమిన్ బి6, ఫోలేట్, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి ఆకుల్లో దుంపల కంటే రెట్టింపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాన్సర్ను నివారించడంలో, బరువును నియంత్రించడంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. సలాడ్.. ముల్లంగిని, వీటి ఆకులను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటిని సలాడ్లో జోడించాలి. ఆకుపచ్చ కూరగాయలు, దోసకాయ, క్యారెట్లతో కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. ముల్లంగి ముక్కలను హుమ్ముస్ లేదా పెరుగుతో తినవచ్చు. సూప్లు, టాకోస్ లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు. ఆకులు.. ముల్లంగి మాత్రమే కాదు.. ఆకులు కూడా ఆరోగ్యమే.. వీటిలో పోషకాలు కూడా అధికం. ముల్లంగి కంటే ముల్లంగి ఆకులలో ఎక్కువ కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. స్మూతీస్లో ముల్లంగి ఆకులను జోడించడం ద్వారా పోషకాహాలను పెంచుకోవచ్చు. వెల్లుల్లి, ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పుతో వేయించిన ముల్లంగి ఆకులను తిసుకోవచ్చు. తరిగిన ముల్లంగి ఆకులను సూప్లు, వంటలలో జోడించవచ్చు. ఊరగాయ.. ముల్లంగితో ఊరగాయ అనగానే చాలామంది షాకవుతారేమో.. కానీ ఇలా ముల్లంగిని ఊరబెట్టడం ద్వారా దానిలో ప్రోబయోటిక్ కంటెంట్ పెరుగుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముల్లంగి ఊరగాయ కోసం ముల్లంగి ముక్కలను ఉప్పు నీటిలో పులియబెట్టాలి. దీనిని శాండ్విచ్ లేదా సైడ్ డిష్ గా తినవచ్చు. ఇంకా ముల్లంగితో కిమ్చిని కూడా తయారు చేయవచ్చు. చైనా, జపాన్ లలో వీటిని ఎక్కువగా తింటారు. ఆరోగ్యకరమైన కొవ్వులతో.. ముల్లంగిలో కొవ్వులో కరిగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో బాగా శోషించబడతాయి. సలాడ్ లేదా టోస్ట్ చేసేటప్పుడు అవోకాడోతో ముల్లంగిని జోడించవచ్చు. కాల్చిన గింజలు లేదా విత్తనాలతో ముల్లంగి సలాడ్ తీసుకోవ్చచు. ముల్లంగి ముక్కల్లో ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి తినవచ్చు. స్మూతీ.. ముల్లంగి రసం కాలేయాన్ని శుధ్ది చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ముల్లంగి, యాపిల్, క్యారెట్, అల్లం కలిపి తాజా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ముల్లంగి, దోసకాయ, నిమ్మ, బచ్చలికూరతో డిటాక్స్ స్మూతీని కూడా తయారు చేసి త్రాగవచ్చు. *రూపశ్రీ.
read moreఫైల్స్ సమస్య మూడు రోజుల్లోనే నయం కావాలంటే ఈ పవర్ఫుల్ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!
మలబద్ధకం సమస్య దీర్ఘకాలం కొనసాగినప్పుడు, పైల్స్ ఏర్పడతాయి. ఇది తీవ్రమైన సమస్య. పైల్స్ ఫిస్టులా వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫైల్స్ వచ్చినవారు దాని నివారణకు పైల్స్ తొలగించడం కోసం శస్త్రచికిత్స, ఇంజెక్షన్ సహాయం తీసుకుంటారు. కానీ చాలా సార్లు ఈ చికిత్స ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే మలబద్దకం సమస్యను నివారించకపోతే పైల్స్ సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి రావచ్చు. యోగా గురువు బాబా రామ్దేవ్ రెండు వేల సంవత్సరాల నాటి పద్దతులను అనుసరించడం ద్వారా కేవలం 3 రోజుల్లోనే ఈ సమస్య నయమవుతుందని పేర్కొన్నారు. అసలు పైల్స్ సమస్య లక్షణాలేంటి? పైల్స్ తగ్గించే పద్దతులు ఏంటి? పైల్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? తెలుసుకుంటే.. పైల్స్ లక్షణాలు.. మలంతో పాటు ఎర్రటి రక్తం రావడం. మలద్వారం వద్ద దురద రావడం. మూత్ర విసర్జన చేసిన వెంటనే మలం ఒత్తిడి. మలద్వారం వద్ద గడ్డలాగా ఏర్పడటం. మలద్వారం వద్ద నొప్పిగా ఉండటం. పైల్స్ కు బాబా రాందేవ్ చెప్పిన చిట్కాలు.. పాలు, నిమ్మకాయ.. బాబా రామ్ దేవ్ చెప్పిన టిప్స్ లో పాలు, నిమ్మకాయ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక కప్పు చల్లని పాలలో ఒక నిమ్మకాయ పిండాలి. తరువాత ఈ నిమ్మకాయ పిండిన పాలను వెంటనే తాగేయాలి. ఈ పాలను ఎక్కువసేపు ఉంచిదే పాలు పగిలిపోతాయి. కాబట్టి పాలలో నిమ్మరసం పిండగానే తాగెయ్యాలి. దీన్ని మూడు రోజుల పాటు తీసుకోవాలి. అయితే ఇందుకోసం గేదె పాలు తీసుకోకూడదు. దానికి బదులుగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలి. అరటి, కర్పూరం.. పైల్స్ నివారణ కోసం అరటి, కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. పండిన అరటిపండులో పావు వంతు తీసుకుని దాన్ని చీల్చాలి. దానిలో గ్రాముకు సమానమైన కర్పూరాన్ని ఉంచి ఆపై దానిని మింగాలట. ఇలా మూడు రోజులు తింటే పైల్స్ సమస్య కంట్రోల్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ చిట్కా ఫాలో అయ్యేవారు భీమసేని కర్పూరం వాడాలి. పైల్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే.. పుష్కలంగా నీరు త్రాగాలి. మలద్వారం వద్ద దురద, నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. పైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఘన ఆహారం, ఎక్కువ సేపు జీర్ణం అయ్యే ఆహారాలకు దూరం ఉండాలి. పైన చెప్పుకున్న చిట్కాలు పైల్స్ సమస్యను తగ్గిస్తాయని చెప్పారు తప్ప.. వైద్యులు ఇచ్చే ఔషధాలు, వైద్యులు చేసే ట్రీట్మెంట్ కు ఇవి ప్రత్యామ్నాయం కాదు. పైల్స్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. *రూపశ్రీ.
read moreచలికాలంలో పెరిగే ఆర్థరైటిస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!
చలికాలం లేదా శీతాకాలం ప్రజలకు అనేక సవాళ్ళను విసురుతుంది. చాలా వరకు వైరస్లు తక్కువ ఉష్ణోగ్రతలలో చురుకుగా మారతాయి. దీని కారణంగా ఇన్ఫ్లుఎంజా, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్ ఇలాంటి ఇన్పెక్షన్ సమస్యలే కాకుండా ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. చల్లని నెలల్లో ఆర్థరైటిస్ తో బాధపడేవారు మంటను కలిగి ఉంటారు. కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఇది సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో అధికంగా ఉండటం వల్ల మామూలు కంటే ఎక్కువ ఇబ్బంది పడతారు. అందుకే ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లని వాతావరణంలో సైనోవియల్ ఫ్లూయిడ్ (రెండు ఎముకల మధ్య ఉండే పదార్థం) మందంలో మార్పుల వల్ల ఈ సమస్యలు వస్తాయి. సైనోవియల్ ద్రవం కీళ్ళు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ ద్రవం గట్టిపడటం వల్ల కీళ్లు గట్టిగా మారడం వల్ల నొప్పి, దృఢత్వంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరుగుతాయి. చలికాలంలో కీళ్లనొప్పులు ఇందుకే.. చలికాలంలో ఆర్థరైటిస్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం, శారీరకంగా చురుగ్గా లేకపోవడమే అని వైద్యులు అంటున్నారు. ఇలా ఉండటం వల్ల కండరాల బలహీనత, కీళ్లు బిగుసుకుపోవడం జరుగుతుంది. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ డి కి మూలం. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది ఎముకలకు చాలా హానికరం. కీళ్ల సమస్యలు తగ్గాలంటే.. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఎలక్ట్రిక్ బ్లాంకెట్, రూమ్ హీటర్ లేదా గది వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. శీతాకాలంలో ఉన్ని బట్టలు, థర్మల్లను ధరించాలి. ముఖ్యంగా కీళ్లను కప్పి ఉంచాలి. ఈ పనులు చేయడం వల్ల కీళ్ళు బిగుసుకుపోవడాన్ని నివారించవచ్చు. కీళ్లకు వెచ్చని కంప్రెస్ను ఉంచాలి. ఇది కూడా బాగా పని చేస్తుంది. ఇవన్నీ పాటిస్తే కీళ్లు బిగుసుకుపోకుండా చూసుకోవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం కీళ్ల కదలికను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. చలి కారణంగా నడక చాలా కష్టంగా ఉంటే, యోగా, స్ట్రెచింగ్ వంటి తేలికపాటి ఇండోర్ వ్యాయామాలను ప్రయత్నించాలి. వ్యాయామాలు కండరాల బలం, ఉమ్మడి కదలికను నిర్వహించడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి కీళ్లనొప్పులు లేదా దాని వల్ల వచ్చే సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కీళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి, ఆర్థరైటిస్ సమస్య పెరగకుండా నిరోధించడానికి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, ప్రతి రాత్రి 6 నుండి 8 గంటలు నిద్రించడం చాలా ముఖ్యం. మొత్తం ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. ఇది తాపజనక ప్రతిస్పందనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. *రూపశ్రీ.
read moreచలికాలంలో ఎన్ని గ్లాసుల నీరు తాగాలి?
నీటి ఉనికి ఉన్న చోట మానవ మనుగడ సాధ్యమవుతుందని అంటారు. మనుషులకే కాకుండా సకల జీవకోటికి నీరు అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతూ ఉంటారు. ఇక లీటర్లలో అయితే 2 నుండి 3 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలని కూడా అంటారు. కానీ చలికాలంలో చాలా మంది నీరు తాగడం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటారు. చలికారణంగా చాలా మందికి దాహం అనిపించదు. దీని కారణంగా నీరు ఎక్కువగా తాగరు. అయితే చలికాలంలో ఎన్ని గ్లాసుల నీరు తాగానే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు నీరు కూడా బాగా తాగాలి. నీరు శరీరానికి ఇంధన వనరు లాంటిది. నీరు బాగా తాగితే శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరంలో వ్యర్థాలు కూడా చెమట రూపంలో, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. చలి కారణంగా చలికాలంలో దాహం బాగా తగ్గుతుంది. ఈ కారణంగా నీరు తాగడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండి పని చేసుకునే వారు నీరు తక్కువగా తాగుతుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. సీజన్ ఏదైనా సరే.. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీరు తాగాలని అంటారు. అంటే ఇది 8 నుండి 12 గ్లాసుల నీటికి సమానం. తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోయి అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో నీరు తక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. దీని వల్ల చర్మ సంబంధ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో జీర్ణాశయానికి ఇబ్బంది ఏర్పడుతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలం కదా అని నీరు తక్కువగా తీసుకోకూడదు. కనీసం రెండున్నర నుండి మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. *రూపశ్రీ.
read moreగాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా? ఇలా వదిలించుకోండి..!
చాలామందికి ఆహారం, అలవాట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఈ సమస్య వంశపార్యపరంగా కూడా వస్తుంది. అయితే ఈ మద్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య అధికంగా మారింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను తెలుగులో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడ్డాయని చెబుతారు. పిత్తాశయం లివర్ కు కొంచెం దిగువ భాగంలో ఉంటుంది. చాలా వరకు ఆపరేషన్ చేసి పిత్తాశయాన్ని తొలగిస్తుంటారు. దీని వల్ల వచ్చే సమస్య ఏమీ లేదని కూడా అంటారు. కానీ పిత్తాశయాన్ని తొలగించకుండా పిత్తాశయంలో రాళ్లు తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. యాపిల్ సైడర్ వెనిగర్.. వెనిగర్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో మిక్స్ చేసుకుని తాగుతుంటారు. దీన్ని తాగడం వల్ల పిత్తాశయం రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ రాళ్లను కరిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పియర్.. పియర్ పండ్లలో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. పియర్ పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని తప్పనిసరిగా తినాలి. ఇది మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది. జ్యూస్.. జ్యూస్ లు శరీరాన్ని శుద్ది చేయడంలో, శరీరంలో టాక్సన్లు బయటకు పంపడంలో సహాయపడతాయి. బిట్ రూట్, క్యారెట్, కీర దోసకాయ.. ఈ మూడు కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి, ఇది సులభంగా జీర్ణం అవుతుంది. గాల్ బ్లాడర్ లో రాళ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తంగేడు.. తంగేడు ఆకులు పల్లె ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి. ఈ తంగేడు ఆకులను కూడా పిత్తాశయం రాళ్లు వదిలించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇందుకోసం తంగేడు ఆకులను తేనెతో కలిపి తీసుకోవాలి. దీని వల్ల రాళ్ల నొప్పి కూడా తగ్గిపోతుంది. పుదీనా.. పుదీనా రాళ్లను తగ్గించడంలో సహాయపుడుతుంది. కేవలం గాల్ బ్లాడర్ సమస్యకే కాదు.. కిడ్నీ రాళ్లకు కూడా ఇది సహాయపడుతుంది. పుదీనాలో టెర్పెన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను నెమ్మదిగా తొలగిస్తుంది. పుదీనాను వీలైనంత ఆహారంలో తీసుకోవాలి. పుదీనా జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్-సి పుష్కలంగా తీసుకోవాలి. ఎరుపు రంగు క్యాప్సికం లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు.. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తినడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య, దాని ప్రమాదం కూడా దూరం అవుతుంది. పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపు తినడం వల్ల పిత్తాశయం రాళ్లు క్రమంగా విరిగిపోయి అవి బయటకు వచ్చేస్తాయి. *రూపశ్రీ.
read more












.webp)
.webp)
.webp)






.webp)
