• Tithi - May, 01 2024

    01.05.2024 బుధవారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం
    తిథి : అష్టమి:రా.12.56వరకు
    నక్షత్రం : శ్రావణం:రా.12.29వరకు
    వర్జ్యం : తె.04.46-05.46వరకు
    దుర్ముహూర్తం : ఉ11.31-12.22 వరకు
    రాహుకాలం : మ12.00- 1.30వరకు

  • May, 2024 Important Days

    1. మేడే
    2. శుక్రమౌఢ్యమి ప్రా||
    5. గురుమౌఢ్యమి ప్రా||
    6. మాసశివరాత్రి
    10. అక్షయ తృతీయ
    12. శ్రీ శంకర జయంతి
    27. నెహ్రూ జయంతి, 
    సంకటహర చతుర్థి

Latest Articles

భారతీయ హిందూ ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. చెట్టు పుట్టను, పక్షులు, జంతువులను, పంచభూతాలను దైవంగా భావించి పూజించే సంస్కృతి హిందూ ధర్మానిది. ప్రతి మాసంలో ఎన్నో ప్రత్యేక రోజులు వస్తుంటాయి. వైశాఖ మాసంలో  అష్టమి తిథికి కూడా ప్రత్యేకత ఉంది. వైశాఖ మాస అష్టమిని కాలాష్టమి అని అంటారు. మే 01 తేదీన వచ్చిన ఈ కాలాష్టమి తిథి ప్రత్యేకత, ఆ రోజు శివుడిని పూజిస్తే ఏం జరుగుతుంది తెలుసుకుంటే..

 More

​పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగలు పన్నెండు అని అందరికీ తెలిసిందే. ద్వాదధ జ్యోతిర్లింగం కాకపోయినా వాటితో సమానమైన మహిమ కలిగిన శైవ క్షేత్రం ఒకటి ఉంది. అక్కడ పరమేశ్వరుడు అత్రేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు వెలసిన విధానం గురించి ఓ వృత్తాంతం ఉంది. అది ఏమిటంటే..

 More

Videos

  • Enduku - Emiti

    ​శ్రీ విష్ణు సహస్రనామం విష్ణువు యొక్క వేయి నామాల వర్ణన. విష్ణుసహస్రనామాన్ని స్త్రీలు పారాయణం చేయకూడదని కొందరు పండితులు అంటున్నారు. దీనికి కారణం ఏమిటి? స్త్రీలు విష్ణు సహస్రనామం ఎందుకు పఠించకూడదు....

     More

    మన చుట్టూ అనేక శివాలయాలు ఉన్నప్పటికీ..కొన్ని ఆలయాలు ప్రత్యేక రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ 5 శివాలయాలు ఉన్నాయి. సైంటిస్టులకు సవాల్ విసురుతున్న ఈ 5 శివాలయాల రహస్యం ఏంటో తెలుసుకుందాం.

     More
  • Vaastu

    దేవాలయాల్లోని విగ్రహాల పరిమాణం, ఇంట్లోని విగ్రహాలు వేర్వేరుగా ఉంటాయి. దేవాలయాలలో.. దేవుని గదిలో దేవుని విగ్రహాలను ప్రతిష్టించడానికి దాని స్వంత నియమాలు ఉన్నాయి. దేవుడి గదిలో పెట్టే విగ్రహాల సైజు పెద్దగా ఉండకూడదని చెబుతారు. వాటిని చాలా సింపుల్ గా పూజించడానికి దేవుడి గదిలో చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే ఉంచుతారు.

     More

    సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తాడంటే దీనికి ఎంత ప్రాదాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఈక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.  కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యలను పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే..

     More
  • Aacharaalu

    ​విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది. తులసి మాతను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడు. విష్ణువు అనుగ్రహం ఉంటే  అన్ని కోరికలు తీరతాయి.  కష్టాల నుండి గట్టెక్కుతారు.  దీనితో పాటు ఆదాయం,  అదృష్టం కూడా పెరగుతుంది. అందుకే  ప్రతిరోజూ తులసి మాతను పూజిస్తారు. ఇంట్లోని స్త్రీలు ప్రతిరోజూ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత తులసి మాతకు నీటిని సమర్పించడం ప్రతి ఇంట్లో కనిపించేదే....

     More

    మాఘమాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున త్రివేణి సంగమం, గంగా లేదా ఇతర పుణ్యనదులలో స్నానమాచరించి దానధర్మాలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య ఫిబ్రవరి 9 న వస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, అమావాస్య రోజున ఉపవాసం పాటించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు.  ఇది మాత్రమే కాకుండా ఉపవాసం ఉండే వారి  లక్ష్యాలన్నీ నెరవేరాలని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు.  మరొక విశేషం ఏమిటంటే.. ఈ మౌని అమావాస్య  70ఏళ్ల తరువాత వస్తోంది. ఈ కారణంగా  అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయని  జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  మౌని అమావాస్యరోజున  స్నానం,  దానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ఫలితాలు ఏంటి? తెలుసుకుంటే..

     More

​అమ్మ వారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్టే.. అమ్మవారి   సౌందర్యం కూడా నాలుగు రకాలు. రూపంలో నాలుగు రకాలు. ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం. ఆ స్వరూపం తలచుకుంటే చాలు, ఆనందం  లభిస్తుంది. అందుకే ధ్యానం చేస్తాం. ఎర్రని కాంతులతో, విశాలమైన నేత్రాలతో, మందహాస వదనంతో, నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలూ ధరించి ఆసనంపై కూర్చుని  గోచరిస్తున్న కామాక్షీ స్వరూపం 'స్థూల సౌందర్యం'. దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది. 'సూక్ష్మ సౌందర్యం' తరువాత 'సూక్ష్మతర సౌందర్యం', ఆ తరువాత 'సూక్ష్మతమ సౌందర్యం' అని మొత్తం నాలుగు రకాలు. 

 More

​జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు.  వ్యక్తులు  చేసే పనులను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు  న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం. ఇక శని దోషం, జీవితంలో సమస్యలు ఉన్న వారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు.  అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే..

 More

​గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది..

 More

​సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  "దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు" అన్నాడు...

 More

​ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.

 More

​హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??.

 More