సుశాంత్ చనిపోయాక ఆయన కంపెనీ ఐపీ అడ్రస్ మార్చేశారా?
on Aug 11, 2020
జూన్లో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆకస్మికంగా మృతి చెందిన దగ్గర్నుంచీ ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో సుశాంత్ లవర్ రియా చక్రవర్తి ఫ్యామిలీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు ఇంటరాగేట్ చేశారు. కాగా సుశాంత్, రియా కలిసి స్టార్ట్ చేసిన ఓ కంపెనీ ఐపీ అడ్రస్, డొమైన్ నేమ్ను సుశాంత్ మృతి తర్వాత మార్చేశారనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ కంపెనీలో రియా సోదరుడు షోవిక్ కూడా ఒక డైరెక్టర్గా ఉన్నాడు. ఆ కంపెనీ పేరు 'Rheality'.
జూన్ 23న మొదటిసారి దాని ఐపీ అడ్రస్ను మార్చగా, ఆగస్ట్ 7న మరోసారి మార్చారని టైమ్స్ నౌ చానల్ ఓ కథనం వెలువరించింది. అంతే కాకుండా వెబ్సైట్ డొమైన్ నేమ్ను కూడా సుశాంత్ మరణం తర్వాత మార్చారని అది ఆరోపించింది. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఐపీ అడ్రస్, డొమైన్ నేమ్ మార్చాల్సిన.. అదీ సుశాంత్ మృతి అనంతరం మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రియా చక్రవర్తి, మరో ఐదుగురిపై సుశాంత్ తండ్రి కె.కె. సింగ్ పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఆ తర్వాత బిహార్ ప్రభుత్వం సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రియా, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించబోతోంది.
Also Read