ప్రభాస్ చాలెంజ్ యాక్సెప్ట్ చేసిన శ్రద్ధ మొక్కలు నాటింది!
on Sep 16, 2020
బాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన శ్రద్ధా కపూర్ టాలీవుడ్కు 'సాహో' సినిమాతో పరిచయమైంది. తెలుగు వెర్షన్తో పోలిస్తే హిందీ వెర్షన్ హిట్టవడం వేరే సంగతి. అందులో ప్రభాస్కు పర్ఫెక్ట్ జోడీగా ఆకట్టుకుంది శ్రద్ధ. తెరపై ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందని అందరూ ప్రశంసించారు. అందులో యాక్షన్ సీన్స్లోనూ రాణించింది శ్రద్ధ.
ఇప్పుడు సాహో ప్రభాస్ ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను ఆమె స్వీకరించింది. ముంబైలోని తన నివాసంలో కొన్ని మొక్కలు నాటి ఆ విషయాన్ని తన ఫేస్బుక్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. కుండీలో నాటిన మొక్కతో దిగిన పిక్చర్ను షేర్ చేసిన ఆమె, "నన్ను గ్రీన్ ఇండియా చాలెంజ్కు నామినేట్ చేసినందుకు థాంక్యూ ప్రభాస్. నేను కొన్ని మొక్కల్ని నాటాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఎంపీ సంతోష్కుమార్ సర్కు స్పెషల్ థాంక్స్" అంటూ పోస్ట్ చేసింది శ్రద్ధ.
వృత్తిపరంగా చూస్తే.. ప్రస్తుతం ఆమె లవ్ రంజన్ డైరెక్షన్లో రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తోంది.
Also Read