మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్' యూనిట్.. వైరల్ అయిన వీడియో క్లిప్!
on Dec 3, 2020
జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో, కల్పిత ఘటనలతో ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. రామరాజుగా చరణ్, భీమ్గా తారక్ నటిస్తున్నారు. ఇటీవల 50 రోజులు సుదీర్ఘ షెడ్యూల్లో నైట్లో యాక్షన్ సీక్వెన్స్లను తీసిన రాజమౌళి తాజాగా మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో చిన్న షెడ్యూల్ను ప్లాన్ చేశారు.
ఈ షెడ్యూల్లో హీరోలిద్దరూ పాల్గొంటారని నిర్మాతలు తెలిపారు. ఈ విషయాన్ని మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. దాంతో పాటు అక్కడి లొకేషన్లను సంబంధించిన ఓ వీడియో క్లిప్ను షేర్ చేశారు. అందులో రాజమౌళి బృందం లొకేషన్లను పరిశీలించడంతో పాటు, అక్కడ షూటింగ్కు వినియోగించే మూవింగ్ క్రేన్స్, డ్రోన్ కెమెరాలను కూడా చూపించారు. "It's time to hustle! A very short schedule in and around the beautiful locales of Mahabaleshwar with @tarak9999 & @AlwaysRamCharan is underway at a brisk pace :)" అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్లకు వచ్చిన రెస్పాన్స్ అమోఘం. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్నీ ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవ్గణ్, శ్రియ, సముద్రకని కీలక పాత్రలు చేస్తున్నారు. 2021 వేసవిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నది.
Also Read