అమితాబ్తో ఎఫైర్ పెట్టుకున్న రేఖను డిన్నర్కు పిలిచిన జయా బచ్చన్!
on Dec 3, 2020
బాలీవుడ్లో కలకలం రేపిన ఎఫైర్స్లో అమితాబ్ బచ్చన్, రేఖ మధ్య అనుబంధం ముందు వరుసలో ఉంటుంది. 'దో అంజానే' (1976) మూవీలో కలిసి పనిచేసేటప్పుడు ఆ ఇద్దరి లవ్ స్టోరీ మొదలైందని బాలీవుడ్లో చెప్పుకుంటారు. అప్పటికే జయబాధురిని అమితాబ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ రహస్య అనుబంధం తొలినాళ్లలో ఆ ఇద్దరూ రేఖ ఫ్రెండ్కు చెందిన ఓ బంగళాలో కలుసుకుంటూ ఉండేవారు. ఒక అనూహ్యమైన ఘటన జరిగేదాకా వారి బంధం అలా స్మూత్గా కొనసాగుతూ వచ్చింది.
'గంగా కీ సౌగంధ్' (1978) సినిమా సెట్స్పై రేఖతో ఓ సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అతనిపై అమితాబ్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అప్పుడే అందరి దృష్టిలో అమితాబ్, రేఖ మధ్య అనుబంధం పడింది. ఆ ఘటన తర్వాతే మీడియాలో ఆ ఇద్దరిపై వార్తలు రావడం మొదలైంది. తమ రిలేషన్షిప్ ప్రచారాన్ని ఆ ఇద్దరూ ఖండించారు కానీ, ఇండస్ట్రీలో అందరికీ వారు డేటింగ్లో ఉన్నారనే విషయం తెలిసిపోయింది. డైరెక్టర్ యశ్ చోప్రా సైతం ఓ ఇంటర్వ్యూలో వారి మధ్య బంధాన్ని ధ్రువీకరించారు.
అమితాబ్, రేఖ రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం కూడా ఉధృతంగా కొనసాగింది. దీనికి కారణం.. రిషి కపూర్, నీతు సింగ్ పెళ్లికి మెడలో మంగళసూత్రంతో రేఖ హాజరవడం! ఆ టైమ్లో అక్కడి అందరి దృష్టీ రిషి-నీతు పెళ్లి మీద కాకుండా రేఖ మంగళసూత్రంపైనే ఉంది. అమితాబ్ ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అందరూ గుసగుసలాడుకున్నారు. అదే సమయంలో ఆమె అక్కడే ఉన్న అమితాబ్ దగ్గరకు వెళ్లి క్యాజువల్గా మాట్లాడుతుంటే, అందరూ వారి పెళ్లి జరిగిందని కన్ఫామ్ చేసుకున్నారు.
అప్పటి దాకా జయా బచ్చన్కు వారి వ్యవహారం తెలీదు. రిషి పెళ్లిలో జరిగిన ఘటన తర్వాతే ఆమె దృష్టికి అది వెళ్లింది. రేఖను ఆమె తమ ఇంటికి డిన్నర్కు పిలిచారు. ఏదేమైనా తన భర్తను తాను వదిలిపెట్టనని రేఖకు ఆమె స్పష్టం చేశారు. తన మాటను ఆమె నిలబెట్టుకున్నారు. దాంతో రేఖ రియలైజ్ అయ్యారనీ, అమితాబ్కు దూరంగా ఉండటం మొదలు పెట్టారనీ జనం చెప్పుకుంటారు. ఆ సమయంలోనే రేఖతో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని అమితాబ్ ప్రకటించారు. 1984లో ఫిల్మ్ఫేర్ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రేఖ స్పందించారు. తన ఇమేజ్, తన ఫ్యామిలీ, తన పిల్లలను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే అమితాబ్ అలా చెప్పారని ఆమె సమర్థించారు. "ఆయనపై నా ప్రేమ కానీ, నాపై ఆయన ప్రేమ కానీ పబ్లిక్కు తెలవాల్సిన పనేముంది? నేను ఆయనను ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు.. అంతే" అని ఆమె చెప్పారు.
Also Read