లక్కీ మంత్కి నితిన్ 'చెక్'!
on Nov 29, 2020
యంగ్ హీరో నితిన్కి ఫిబ్రవరి లక్కీ మంత్ అనే చెప్పాలి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తరుణంలో.. 2012 ఫిబ్రవరిలో విడుదలైన 'ఇష్క్' మూవీ నితిన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. అలాగే.. అ ఆ చిత్రం తరువాత ట్రాక్ తప్పిన ఈ టాలెంటెడ్ హీరోకి మళ్ళీ విజయాన్ని అందించిన 'భీష్మ' కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే జనం ముందుకు వచ్చింది. అందుకే.. తన లక్కీ మంత్లో మరోసారి సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట నితిన్.
ఆ వివరాల్లోకి వెళితే.. సృజనాత్మక చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో 'చెక్' పేరుతో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని 2021 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, 'చెక్' కంటే ముందు నితిన్ నుంచి 'రంగ్ దే' రాబోతోంది. 2021 సంక్రాంతికి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రిలీజ్ కాబోతోంది.