విష్వక్ సేన్ ప్లేస్లో అడివి శేష్?
on Nov 29, 2020
అమీతుమీ (2017), గూఢచారి (2018), ఎవరు (2019).. ఇలా ఏడాదికో హిట్ తో పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నాడు అడివి శేష్. అలాగే.. చిత్రచిత్ర ప్రవర్ధమానంగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్.. పాన్ ఇండియన్ మూవీ 'మేజర్'లో నటిస్తున్నాడు. ఆ తరువాత 'గూఢచారి' సీక్వెల్ లోనూ సందడి చేయనున్నాడు. అంతేకాదు.. మరో సీక్వెల్ లోనూ అడివి శేష్ నటించే అవకాశముందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'హిట్' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విష్వక్ సేన్ కథానాయకుడిగా నటించాడు. కాగా, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ కొనసాగింపు చిత్రంలో ఈ సారి విష్వక్ సేన్ కాకుండా, అడివి శేష్ హీరోగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శేష్.. నాని చాయిస్ అనీ, అతను కూడా చేయడానికి అంగీకరించాడనీ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ సీక్వెల్ కి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నాడు.
Also Read