భర్త కంటే ముందు తెలుగులో షూటింగ్ స్టార్ట్ చేసిన భార్య!
on Apr 19, 2021
మలయాళం స్టార్ యాక్టర్లు నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ భార్యాభర్తలు. ఇద్దరూ దాదాపు ఒకే టైమ్లో టాలీవుడ్లోకి అడుగుపెడుతుండటం కాకతాళీయం. అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తోన్న 'పుష్ప'లో ఫహద్ విలన్గా ఎంపికయ్యాడు. మలయాళంలో స్టార్ హీరో అయిన అతను స్వయంగా నిర్మించిన 'కుంబళంగి నైట్స్'లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో సూపర్బ్గా రాణించాడు. ఇప్పుడు 'పుష్ప'లో కరడుగట్టిన విలన్ రోల్లో భయంకరంగా కనిపించనున్నాడు.
అతను ఇంకా 'పుష్ప' సెట్స్ మీదకు రాకుండానే, నజ్రియా టాలీవుడ్లో అడుగుపెట్టేసింది. నాని హీరోగా నటిస్తోన్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికి!' సినిమాలో ఆమె నాయికగా నటిస్తోంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమా సెట్స్ మీదకు ఈరోజే ఆమె అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ సినిమా తనకు చాలా స్పెషల్ అంటూ అనౌన్స్ చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్లో ఆమె, "అందరికీ నమస్కారం! ఈరోజు నా తొలి తెలుగు చిత్రం షూటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అనేది ఎప్పటికీ స్పెషలే. అంటే సుందరానికి స్పెషల్ కాబోతోంది." అని అందులో రాసుకొచ్చింది నజ్రియా.
మొదట మలయాళంలో సినిమాల్లో నటించిన ఆమె 2013లోనే అట్లీ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'రాజా రాణి'తో కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. అక్కడ జై, ధనుష్, దుల్కర్ సల్మాన్లతో నటించింది. 2014లో 'బెంగళూర్ డేస్'లో భార్యాభర్తలుగా నటించిన నజ్రియా, ఫహాద్ మధ్య అప్పుడే ప్రేమ చిగురించింది. అదే ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరగగా, ఆగస్ట్ 21న తిరువనంతపురమ్లో పెళ్లి చేసుకున్నారు.
భర్త ప్రోత్సాహంతో పెళ్లయిన మూడేళ్ల తర్వాత నజ్రియా మళ్లీ నటించడం మొదలుపెట్టింది. 2018లో పృథ్వీరాజ్తో 'కూడే', 2020లో భర్త ఫహద్తో 'ట్రాన్స్' సినిమాల్లో నటించింది. వాటి తర్వాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా 'అంటే సుందరానికి' కావడం గమనార్హం.
Also Read