తారక్, మహేశ్ను దాటేసిన బన్నీ!
on Apr 10, 2020
'అల వైకుంఠపురములో' సినిమాతో అంతకు ముందు 'నా పేరు సూర్య' ఇచ్చిన చేదు అనుభవాన్ని తుడిచి పెట్టేశాడు అల్లు అర్జున్. పైగా బాక్సాఫీస్ పరంగా అది నాన్-బాహుబలి 2 రికార్డుల్ని సాధించిందాయె. సంక్రాంతికి విడుదలైన మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీపడి ఈ ఫీట్ సాధించడంతో బన్నీ ఆనందం రెట్టింపయ్యింది. అందుకే కరోనా క్రైసిస్లో మహేశ్ కంటే రూ. 20 లక్షలు ఎక్కువ విరాళం ఇచ్చి, ఆ విషయంలోనూ ఆధిపత్యం చూపించాడు.
ఆ విషయం అలా ఉంచితే, ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేసిన 'పుష్ప' ఫస్ట్ లుక్ అసాధారణ స్పందన సాధించింది. 'అల వైకుంఠపురములో' మూవీలోని స్టైలిష్ ఫస్ట్ లుక్ కంటే, 'పుష్ప'గా అతడి మొరటు లుక్కే నెటిజన్లను బాగా ఆకర్షించిందని దానికి వచ్చిన రెస్పాన్స్ చెబుతోంది. ఎంతగా అంటే.. ట్విట్టర్లో అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్గా నిలిచేంతగా! ఇప్పటికి అది 91.8k లైక్స్ సాధించింది.
ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత వీరరాఘవ' ఫస్ట్ లుక్ పోస్టర్కు 70.2k లైక్స్, మహేశ్ సినిమా 'మహర్షి' ఫస్ట్ లుక్ పోస్టర్ 67.2k లైక్స్ సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు 'పుష్ప' ఫస్ట్ లుక్ దాటేసింది. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.