ఇచ్చిన మాట కోసం మహేష్తో జత కట్టనున్న రాజమౌళి
on May 6, 2017
బాహుబలి కోసం అయిదేళ్ల శ్రమ కోర్చిన రాజమౌళి త్వరలో కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ కి వెళ్లనున్నారు. ప్రస్తుతం అతని తండ్రి, రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కథ తాయారు చేసే పనిలో బిజీ గా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం, లైన్ స్టోరీ ఓకే చేసారని, ప్రసాద్ గారు దాన్ని స్క్రిప్ట్ గా మలిచే పనిలో ఉన్నారని తెలిసింది. రాజమౌళి తదుపరి చిత్రం డీవీవీ దానయ్య నిర్మాణంలో ఉంటుంది. దానయ్యతో సినిమా చేస్తానని రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం కమిట్ అయినా సంగతి మనకి తెలిసిందే. దీంట్లో నటించనున్న నటీ, నటులని రాజమౌళి టూర్ నుండి తిరిగి వచ్చింతర్వాత నిర్ణయిస్తారు.
అయితే, రాజమౌళి దానయ్యకే కాకుండా, ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు కూడా మాట ఇచ్చాడు. ఈ సినిమా మహేష్ బాబు తో చేయడానికి రాజమౌళి అంగీకారం కూడా తెలపడం జరిగింది. దానయ్య తో సినిమా పూర్తవ్వగానే, మహేష్ బాబు తో చేయనున్న సినిమా మొదలవనుంది. ఇంతకు ముందు స్టార్ హీరోలతో జత కట్టడానికి దర్శకులు వేచి చూసేవారు. కానీ, రాజమౌళి ఆ ట్రెండ్ కి బ్రేక్ వేస్తూ తన కోసం హీరోలు వేచి చూసే స్థాయికి ఎదిగారు. ఇది ఖచ్చితంగా దర్శక శాఖలో పని చేసే వారు గర్వంగా చెప్పుకునే అంశం.