కేరళ డొనేషన్.. సిద్ధార్థ్ ఛాలెంజ్
on Aug 18, 2018
కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు విరాళాలు అందిస్తున్నారు.. అయితే హీరో సిద్ధార్థ్ మాత్రం తన వంతుగా 10 లక్షల రూపాయిలు సాయం చేయటంతో పాటు.. కేరళ డొనేషన్ ఛాలెంజ్ను ప్రారంభించారు.. 'నా ఛాలెంజ్ అయిపోయింది మీరు కూడా స్వీకరించాలి’ అంటూ ట్విటర్ ద్వారా సిద్ధార్థ్ తోటివారిని కోరారు.. కికి ఛాలెంజ్ లాంటివి కాకుండా, ఒక రాష్ట్రం కోసం సిద్ధార్థ్ డొనేషన్ ఛాలెంజ్ స్టార్ట్ చేయటం పట్ల నెటిజనులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.