రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!
on May 4, 2024
తెలుగు సీరియల్స్ లలో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. దానికి కారణం మంచి కథ. ఏ సీరియల్ అయిన కథ బాగుంటేనే సరైన హిట్ లభిస్తుంది. ఈ సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మిల జంటకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.
మరోవైపు శ్రీలత, సందీప్ ఇద్దరు అభిని కలుస్తారు. రామలక్ష్మి ఏమవుతుందని వాళ్ళు అడుగగా.. మేమ్ ఫ్రెండ్స్ అని అభి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళింటికి అభి వెళ్ళగా.. సీతాకాంత్ వచ్చాడని అన్నీ తెలుసుకున్నాడని అభి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇక నేటి ప్రోమోలో శ్రీలత, సందీప్, రామలక్ష్మి, సిరి, ధన అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఏంటి మమ్మీ గత రెండు రోజులుగా క్లబ్ కి వెళ్ళట్లేదని శ్రీలతని సందీప్ అడుగగా.. మా ఫ్రెండ్ రాజ్యలక్ష్మి అని ఒకరున్నారు. తన కోడలు పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించి , పెళ్ళి తర్వాత వాడితో లేచిపోయింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ బయటకు రాలేకపోతున్నారని శ్రీలత చెప్తుంది. అది విని రామలక్ష్మి హర్ట్ అవుతుంది. తినకుండా చేయి కడిగేసి వెళ్ళిపోతుంది. అయితే అభి గురించి తెలిసిన నిజాల్ని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పగలడా? అభి ఎవరో శ్రీలత, సందీప్ కనిపెట్టగలరా లాంటి ట్విస్ట్ లతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ కి అభిమానులో కామెంట్ చేయండి.