సాయికుమార్తో కలిసి నటించే ఛాన్స్ రాలేదని బాధపడ్డ కస్తూరి
on Jun 30, 2022
సాయికుమార్ తో కలిసి ఒక్క మూవీ కూడా చేయలేకపోయానని కస్తూరి 'వావ్' షోలో బాధపడింది. ఇక ఇటీవల ప్రసారమైన షో 'వావ్' 100 వ ఎపిసోడ్ కి కస్తూరి, అర్చన, లైలా, రోహిత్ వచ్చి సందడి చేశారు. హోస్ట్ సాయికుమార్ వీళ్ళ 100 డేస్ మూవీస్, వాటి సెలబ్రేషన్స్ ఎవరి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకున్నారంటూ అడిగి వాళ్ళ నుంచి సమాధానాలు చెప్పించారు. "హాయ్ కస్తూరి ఎలా ఉన్నావ్?" అని సాయికుమార్ అడిగేసరికి "అన్ని చోట్ల కలుస్తున్నాం కానీ కలిసి మాత్రం వర్క్ చెయ్యట్లేదు. నాకు చాలా బాధగా వుంది ఈ విషయంలో. ఇట్స్ మై డ్రీం నాట్ కం ట్రూ" అంటూ చెప్పింది కస్తూరి. "ఈ సాయికుమార్ గారితో మాత్రం నేను నటించలేదయా" అంది కస్తూరి.
"అర్చనతో కలిసి 'సామాన్యుడు' చేసాను. లైలాతో కూడా ఛాన్స్ మిస్సయ్యింది" అన్నారు సాయికుమార్. "నాతో ఎన్ని అవకాశాలు మిస్ అయ్యాయో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా" అంది కస్తూరి. "అంటే ఇంతకంటే ఏదో పెద్ద అవకాశం రాబోతోందని అర్థం.. కాబట్టి త్వరలోనే కలిసిచేద్దాం" అని సాయికుమార్ భరోసా ఇచ్చారు. "నెక్స్ట్ టైం చేద్దాం అంటారు కానీ అలాగే ఐపోతోంది కానీ కలిసి నటించే అవకాశం రావట్లేదు" అంటూ ఫీలయ్యింది కస్తూరి.
'ఆతా ఉన్ కోయిలీలే' అనే సినిమా ద్వారా తాను ఆడియన్స్ కి కస్తూరిగా పరిచయమయ్యాను అని చెప్పిందామె. ఆ మూవీని తెలుగులో 'ప్రేమ విజేత' పేరుతో తీశారని చెప్పారు సాయికుమార్. ఈ మూవీకి కమలహాసన్ చేతులమీదుగా అవార్డు తీసుకోవడం, అందులోనూ అప్పటికే 'భారతీయుడు' మూవీ లో చేసినందుకు కూడా అమితాబ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను అంటూ 'వావ్' 100వ ఎపిసోడ్ లో తన జ్ఞాపకాలను పంచుకుంది కస్తూరి.