నన్ను అలా రక్తంతో చూసేసరికి పిచ్చోడయిపోయాడు
on Oct 23, 2024
బుల్లితెర నటి శ్రీవాణికి రీసెంట్ గా రోడ్ యాక్సిడెంట్ ఐన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే కోలుకుని తన ఇంటికి వచ్చింది. దాంతో ఆమె తన కోసం ప్రార్దించిన వారందరితో మాట్లాడాలి అనుకుని ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. తనకు యాక్సిడెంట్ ఐనప్పుడు అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వాళ్ళు మరీ నీచంగా చూసిన విధానం అలాగే ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పిన సమాధానం పై వాళ్ళు ఫైర్ అయ్యారు. కనీసం ఆ హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేయకుండా అలా చూస్తూ ఉన్నారని చెప్పుకొచ్చింది.
ఐతే ఫైనల్ గా వేరే ఒక హాస్పిటల్ కి వెళ్లడం అక్కడ ఫేస్ మీద కట్ ఐన పార్ట్ కి 20 స్టిచెస్ వేసి తమను బాగా చూసుకున్నారని చెప్పారు. రెండు వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పింది. ఇలాంటి టైములో ఎంతోమంది తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారని అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పింది. తనను అలా రక్తపు మడుగులో చూసిన తన భర్త విక్రమాదిత్య పిచ్చోడయిపోయాడని చెప్పింది. ఇక విక్రమ్ మాట్లాడుతూ అసలు శ్రీవాణి లేకపోతె ఎలా బతకాలో తెలీదని నందిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదని ఎందుకంటే శ్రీవాణి తనను ఒక కొడుకులా చూసుకుంటుంది అని చెప్పాడు. ఐతే ఏ హాస్పిటల్ కి ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ ఎయిడ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది శ్రీవాణి. 24 / 7 అని హాస్పిటల్ బయట బోర్డు పెట్టినప్పుడు పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతుందని వస్తారు. కానీ అక్కడికి వెళ్లేసరికి ఎవరూ ఉండరూ అలాంటప్పుడు ఆ బోర్డులు పెట్టుకోవడం ఎందుకు అంటూ విక్రమ్ మండిపడ్డారు. అంటే అందరూ నిద్రపోవడానికా హాస్పిటల్ ని ఓపెన్ గా పెట్టుకున్నది అంది శ్రీవాణి. ఇక తన గురించి అప్డేట్స్ తెలుసుకుంటున్న అందరికీ థ్యాంక్స్ చెప్పింది.
Also Read