రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా?
on Jan 15, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ ఏ స్థాయిలో పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ స్టేజ్ పై ఆమె మెరుపులు మెరిపిస్తున్నారు. తనదైన మార్కు యాంకరింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. రష్మీకి తోడు సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే గత కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ ల కారణంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయినా రష్మీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
Also read: సుధీర్, రష్మీ జోడీ లేకుంటే 'ఢీ' పరిస్థితి?
ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో భాగంగా సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లని ప్లాన్ చేశారు. `అమ్మమ్మ గారి ఊరు` పేరుతో సంక్రాంతి వంటలు అంటూ కొత్త కామెడీ షోని సంక్రాంతి స్పషల్ గా ప్లాన్ చేశారు. ఈ షోలో హైపర్ ఆది, ప్రదీప్, రోజా, ఆమని, ఆటో రాంప్రసాద్, వర్ష, బాబూ మోహన్, రష్మీ గౌతమ్, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ .. ఆది, ఆటో రాంప్రసాద్, వర్షలపై వేసిన పంచ్లు ఓ రేంజ్ లో పేలి నవ్వులు కురిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారింది.
Also read: దాని కోసం రష్మి-సుధీర్ క్రేజ్ను వాడుకోకండి.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్!
ఈ ఎపిసోడ్ లో మరో హైలైట్ ఏంటంటే రష్మీ గౌతమ్ `పుష్ప`లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ `ఊ అంటా మావ ఉఊ అంటావా` కు పెర్ఫార్మ్ చేయడం. సమంత ఏ రేంజ్ లో హీటెక్కించిందో అదే స్థాయిలో రష్మీ గౌతమ్ తన హొయలతో హీటెక్కించింది. ఈ పాటకు రష్మీ డ్యాన్స్ చేస్తుంటే "రష్మీ చేస్తే ఎవరైనా `ఊ` అనాల్సిందే" అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది. రష్మీ కైపెక్కించే చూపుల్తో రచ్చ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజు ఉదయం 9: 00 గంటలకు ప్రసారం అయ్యింది.
Also Read