రుక్మిణిని సత్యకు పట్టించింది ఇదే!
on Dec 1, 2021
శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రదల కలయికలో వచ్చిన `దేవత` సినిమా స్ఫూర్తితో రూపొందించిన సీరియల్ `దేవత`. అర్జున్ అంబటి, సుహాసిని, వైష్ణవీ రామిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బుధవారం ఈ సీరియల్ 403వ ఎపిసోడ్లోకి ఎంటరవుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. `ఇగో సారూ మీరు రాలేదు కానీ మేమంతా గుడికి వచ్చాం తెలుసా` అంటుంది దేవి ఆదిత్యతో..
మీరంతా అంటే ఎవరెవరు వచ్చారని కంగారుగా అడుగుతాడు దేవిని ఆదిత్య. అమ్మా, నేను, చిన్మయ్, నానమ్మ` అని చెబుతుంది దేవి. వెంటనే ఫోన్ సత్యకు ఇవ్వు అంటాడు. సత్య ఫోన్ తీసుకోవడంతో `నాకు కడుపు నొప్పిగా వుంది ఇంటికిరా` అంటాడు ఆదిత్య. `దీపాలు పెట్టే వేళ అయిందని పది నిమిషాల్లో బయలుదేరతామని` చెబుతుంది సత్య. ఫోన్ పెట్టేసిన ఆదిత్య `ఛ.. ఇప్పుడు సత్య ..రాధని చూస్తే ప్రమాదం అనుకుంటూ పరుగులు పెడతాడు.
ఆగమేఘాల మీద గుడికి చేరిన ఆదిత్య అక్కడ రుక్మిణి, సత్య ఒకకి ఒకరు కనిపించేంత దూరంలో దీపాలు పెడుతుంటే చూసి ఆ ఇద్దరికి అడ్డంగా నిలబడతాడు. `దీపాలు వదిలేశావ్ కదా ఇక ఇంటికి పదా అంటూ సత్యని కంగారు పెడతాడు. కారు ఎక్కి సత్యని ఎక్కమంటాడు. ఈలోగా రుక్మిణి గతంలో ఎక్కి వెళ్లిన కారు కనిపిస్తుంది. ఈ కారు ఇక్కడ వుందంటే అక్క ఇక్కడే వుండివుంటుంది అని ఆదిత్యకు చెప్పకుండానే పరుగులు పెడుతుంది. షాక్కు గురైన ఆదిత్య.. వెంటనే సత్య వెంటపడతాడు. గుడిలో రుక్మిణి కోసం వెతుకుతున్న సత్యకు తాను ఎదురుపడిందా?.. సత్య ఏం చేసింది? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.