రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ...నా ప్రాణం నిలిపారు
on May 10, 2025
సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షో ఫైనల్స్ కి వచ్చేసింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, నటి రోజా వచ్చారు. ఈ షోకి డిటెక్టీవ్ గెటప్ లో పంచ్ ప్రసాద్ వచ్చాడు. రవి అతన్ని చూసి "అసలు నువ్వొచ్చిన పనేంటి" అని అడిగాడు. "నేను డిటెక్టీవ్ ని" అన్నాడు. "ఐతే ఆమె షూస్ , అతని సాక్స్ పోయాయట..అవి కనుక్కో ఫస్ట్" అన్నాడు ప్రసాద్.."సరే ఏదో ఒకటి చెయ్యి ఫస్ట్" అన్నాడు రవి.. "కుడి చెయ్యా ఎడమ చెయ్యా" అని ప్రసాద్ అనేసరికి "ఛి నేనెళ్ళి కూర్చుంటా" అని అష్షు వెళ్ళిపోయింది. ప్రసాద్ తన భార్య ఫోటో చూపించేసరికి రోజా " ఫస్టా, సెకండా, థర్డ్ ఆ" అని అడిగింది. తర్వాత రవి "ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడ్డానికి" అని అడిగాడు.
వెంటనే ప్రసాద్ ఒక రోజా పిక్చర్ తీసి చూపించేసరికి రోజా నవ్వేసింది. "ఈరోజు ఇంత హ్యాపీ లైఫ్ ని భార్యా పిల్లలతో లీడ్ చేస్తున్నాను అంటే మేడం మీరు పెట్టిన బిక్షే మేడం. నిజం చెప్తున్నా మేడం నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మ ఇస్తే రోజమ్మ మా అమ్మ కంటే ఎక్కువ" అంటూ కాళ్ళ మీద పడ్డాడు ప్రసాద్. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో అమ్మాయిగారు - పడమటి సంధ్యారాగం వెర్సెస్ చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ టీమ్స్ మధ్యన ఈ పోటీ జరిగింది. ఇక రోజా ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన ఉప్మా ఛాలెంజ్ లో ఉప్మాన్ని అస్సలు మర్చిపోలేదంటూ చెప్పాడు రవి. "నేను చేసిన ఉప్మా తిన్న వాళ్ళు గెలిచారు చూసారుగా" అంది రోజా. దానికి ప్రభాకర్ కౌంటర్ వేసాడు. "అది ఉప్మా కాదురా...అది బోండాలా ఉన్న ఉప్మా" అన్నాడు. ఇక మంచు లక్ష్మి అమ్మాయిగారు - పడమటి సంధ్య రాగం టీమ్స్ ని లీడ్ చేసింది. రోజా చామంతి- జానకి రామయ్య గారి మనవరాలు టీమ్స్ ని లేదా చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
