నిఖిల్ మళ్ళీ చెత్త డెసిషన్.. ఛీఫ్ రేస్ లో యష్మీకి అన్యాయం!
on Oct 3, 2024
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి వరకు జరిగిన సర్వైవల్ టాస్క్ లో శక్తి టీమ్ ఎక్కువ సార్లు గెలిచింది. దాంతో వారికి ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. టీమ్ లో ఎవరు కొత్త ఛీఫ్ అవుతారో నిర్ణయించుకోమని బిగ్ బాస్ శక్తి టీమ్ ఛీఫ్ నిఖిల్ కి చెప్పాడు.
నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ వేకప్ సాంగ్ కి సగం మందికి పైగా నిద్రలోనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ కుక్క అరుపు సౌండ్ వేసాడు. ఆ తర్వాత అందరు లేశారు. ఇక వారిని యాక్టివ్ చేయడానికి.. 'కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్' అనే టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. దానిలో భాగంగా.. మొదట ఓడిన నాగ మణికంఠకి సూపర్ మచ్చి అనే ఐటమ్ సాంగ్కి చిందులు వేయమని చెప్పగా చేసేశాడు.. మధ్యలో నైనిక జాయిన్ అయ్యింది. ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. ఆ తర్వాత టాస్క్ లో ఓడిన నబీల్కి స్పూన్తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తరువాత ఎప్పుడూ మణికంఠపై విషం చిమ్మే యష్మీని.. అతనితో కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని బిగ్ బాస్ అన్నాడు. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఆ తరువాత ఓడిన పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. అయితే ఈ టాస్క్లో కాంతారా టీమ్ గెలవడంతో వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. తరువాత సర్వైవల్ టాస్క్ ముగిసినట్టు బిగ్ బాస్ తెలిపాడు. అయితే శక్తి టీమ్ సభ్యులు ఎక్కువ టాస్క్లు గెలిచిన కారణం వాళ్లకి స్పెషల్ పవర్ లభిచింది.
వాళ్ల క్లాన్ నుంచి ఒకరు నేరుగా చీఫ్ అవ్వొచ్చని అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. చర్చించుకుని మీలో ఎవరు చీఫ్ కంటెండర్ అవుతారో చెప్పాలని బిగ్ బాస్ అన్నాడు. దాంతో యష్మీ గౌడ.. నా అంత తోపు లేదు.. ఇరగదీశా.. మళ్లీ చీఫ్ అయ్యి ఇరగదీస్తా.. నాకు చాలా నాలెడ్జ్ ఉంది. పృథ్వీకి లేదన్నట్టుగా చెప్పింది. దాంతో పృథ్వీ.. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదని చెప్పాడు. ఇక ఇద్దరి వాదనలు విన్న నిఖిల్ శక్తి టీమ్ నుండి పృథ్వీ చీఫ్ గా ఉంటాడని చెప్పాడు. ఈ నిర్ణయంతో మరోసారి పక్షపాతంగా ఉంటాడని తేలింది. యష్మీ తన పాయింట్లు క్లియర్ గా చెప్పిన అసలు గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియని పృథ్వీని ఛీఫ్ రేసులో ఉంచాడు నిఖిల్.
Also Read