బాల్స్ కోసం పృథ్వీతో గొడవకి దిగిన నిఖిల్.. చూస్తూ ఉండిపోయిన సోనియా!
on Sep 12, 2024
కెరటం, అంతులేని వీరులు, అఖండ.. ఏంటివని అనుకోకండి. బిగ్ బాస్ సీజన్-8 లోని మూడు గ్రూప్ ల పేర్లు. హౌస్ లో మూడు టీమ్ లుగా డివైడ్ చేసి వారి మధ్య టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 8, Day 11 ప్రోమో వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో అంతులేని ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో మొదటగా పూల్ టాస్క్(Pool Task ) ఇచ్చాడు. ఇక ఇందులో విష్ణుప్రియ మొదట స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది. సెకెండ్ మణికంఠ దూకాడు. అయితే అందరు పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు సోనియా పడిపోయింది. ఇక దానికి సోనియా ఎంత చేసిందో ఫుల్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇక మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండో గేమ్ కలర్ బాల్స్(colour Balls).. ఇందులో నిఖిల్ , నబీల్, పృథ్వీ పోటీపడ్డారు. ఇక ముగ్గురి మధ్య పోటీ గట్టిగానే జరిగింది కాసేపటికి నబీల్ తాడుని వదిలేసినట్టు తెలుస్తుంది. ఇక పృథ్వీ, నిఖిల్ మధ్య బాల్స్ కోసం గట్టిగానే కుస్తీ జరిగినట్టుంది.
బాల్స్ కోసం పృథ్వీతో నిఖిల్ గొడవ కు దిగగా.. అక్కడే ఉన్న సోనియా అలాగే చూస్తుండిపోయింది. ఎంతలా అంటే తను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కానీ డైలామాలో ఉంది. ఎందుకంటే ఇద్దరికి తను బాగా క్లోజ్ అయ్యింది. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు హర్ట్ అవుతారు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ప్రోమోని చూసేయ్యండి.
Also Read