పప్పీల టాస్క్ లో ప్రేరణ, నబీల్ ముందంజ.. కొత్త ఛీఫ్ ఎవరంటే!
on Oct 3, 2024
హౌస్ లో సర్వైవల్ ఫిట్టెస్ట్ టాస్క్ జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్నటి దాకా శక్తి, కాంతారా టీమ్ ఫైట్ చేశాయి. కానీ ఈసారి హౌస్ అంతా కలిసి ఆడాలని అందుకే అందరికి ఒక్కరే చీఫ్ గా ఉండాలనే దానికోసం పప్పీల టాస్క్ మొదలెట్టాడు బిగ్ బాస్.
పప్పీల టాస్కు ఏంటంటే.. ఈ టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అక్కడున్న పప్పీలను పట్టుకెళ్లి పప్పీల హౌస్లో పెట్టాలి. ఎవరైతే చివరిగా లోపలికి వెళ్తారో వారితో పాటు.. వారి చేతిలో ఉన్న పప్పీపై పేరున్న కంటెస్టెంట్ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉంటారు. అప్పుడు వీరిలో ఒకరిని చీఫ్ రేసు నుంచి తప్పించాలన్న మాట. ఇక టాస్క్ మధ్యలో ప్రేరణ పరిగెత్తుతుంటే బ్లాక్ చేస్తుందంటూ నైనిక కంప్లెయింట్ చేసింది. కాసేపు ప్రేరణ, నైనిక మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఫస్ట్ గా యష్మీ అవుట్ అయ్యింది. తను మణికంఠ పప్పీని తీసుకొచ్చి తను రేస్ నుండి తప్పుకోవాలని చెప్పడంతో సంచాలకుడిగా ఉన్న పృథ్వీ.. మణికంఠని రేస్ నుండి తప్పించి యష్మీని కొనసాగించమన్నాడు. ఆ తర్వాత ప్రేరణ పప్పీని తీసుకొచ్చింది యష్మీ. ఈ సారి మణికంఠ సంచాలకుడిగా ఉన్నాడు. చీఫ్ పోటీకి ఎవరు అర్హులో ఇద్దరి పాయింట్లు విన్న మణికంఠ.. ప్రేరణని కొనసాగించి, యష్మీని గేమ్ నుండి అవుట్ చేశాడు. ఇక యష్మీకి మణికంఠ మధ్యలో మాటల యుద్ధం జరిగింది.
ఆ తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ ఇద్దరు రాగా యష్మీ సంఛాలక్ గా చేసింది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సపోర్ట్ చేసి విష్ణుప్రియను ఔట్ చేసింది యష్మీ. ఇక తర్వాత సీత-నైనిక వచ్చారు. ఇక వీరిద్దరిలో సీతను పక్కనపెట్టి నైనికకి సపోర్ట్ చేసింది విష్ణుప్రియ. దీంతో సీత రేసు నుంచి ఔట్ అయింది. దీంతో చీఫ్ రేసులో ప్రేరణ, నిఖిల్, ఆదిత్య, నబీల్, నైనికలు మిగిలారు. ఇందులో నైనిక, నిఖిల్ ఇప్పటికే చీఫ్ అయ్యారు. మరి మరోసారి వీరికి అవకాశం దక్కుతుందా లేక రేసులో ఉన్న నబీల్, ఆదిత్య, ప్రేరణల్లో ఎవరికి ఛాన్స్ వస్తుందో చూడాలి మరి. అయితే ఆదిత్య ఓం ఎలిమినేషన్ అయ్యాడనే వార్తలొస్తున్నాయి కాబట్టి నబీల్, ప్రేరణలో కొత్త ఛీఫ్ ఎవరు అవుతారనేది తెలియాల్సి ఉంది.
Also Read