మణికంఠని కార్నర్ చేసిన హౌస్ మేట్స్.. టిష్యూ ఇచ్చి వాడుకోమన్న నాగార్జున!
on Oct 6, 2024
బిగ్ బాస్ సీజన్- 8 లో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూసే వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ వారం కంటెస్టెంట్స్ తో నాగార్జున కొంచెం కూల్ గానే మాట్లాడాడు. మొదటగా మెగా చీఫ్ నబీల్ ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీని పొగిడాడు. నబీల్ కి పృథ్వీ చేత గోల్డెన్ బ్యాండ్ పెట్టించాడు. మణికంఠని యాక్షన్ రూమ్ కి పిలిచి.. ఇక నీకు టైమ్ ఇస్తున్నా ఎంత ఏడుస్తావో ఏడువు టిష్యూని వాడుకోమని చెప్తాడు. నువ్వు అనుకున్నట్టు నీకు ఫుడ్ ప్రియ దగ్గర నుండి రాలేదని అనగానే మణికంఠ ఏడుస్తాడు. కానీ ప్రియ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. నువు ఇంకొకసారి ఏడవొద్దని కూల్ గా వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ఆ టిష్యూ రోల్ నీ దగ్గర పెట్టుకో.. నువ్వు ఎప్పుడైనా ఏడుపు వస్తే అది చూసి నువ్వు కంట్రోల్ చేసుకోవాలని నాగార్జున చెప్తాడు.
ఆ తర్వాత హౌస్ లో ఎవరు ఎలాంటి వాళ్ళో మిర్రర్ బోర్డుతో చెప్పాలని అంటాడు. అందరు కూడా మణికంఠని సెల్ఫిష్, ఇర్రిటేట్ అంటూ మిర్రర్ బోర్డు పెడుతుంటే.. మళ్ళీ లోగా ఫీల్ అవుతాడు మణికంఠ. ఇక తన వంతు వచ్చేసరికి.. నాకు ఎవరు లేరని మణికంఠ చెప్పగానే నాగార్జున సీరియస్ గా.. ఇప్పుడు మళ్ళీ కార్నర్ చేసారని ఫీల్ అవుతున్నావా అని నాగార్జున అనగానే.. లేదని అంటూనే మణికంఠ ఏడుస్తుంటాడు. మళ్ళీ యాక్షన్ రూమ్ లో చెప్పింది గుర్తు చేసి.. నీ గేమ్ నువ్వు ఆడు అనగానే మణికంఠ నార్మల్ అయి గేమ్ కంటిన్యూ చేస్తాడు.
నైనిక నీ గేమ్ మొదటి వారంలో తప్ప.. మరెప్పుడు కనపడలేదని నాగ్ చెప్తాడు. ఇక పృథ్వీని చాలా కోపం కంట్రోల్ చేసుకున్నావ్.. గేమ్ ఇంప్రూవ్ అయిందని నాగ్ మెచ్చుకుంటాడు. ఇలా ఈ వీకెండ్ నాగార్జున మాస్ లా కాకుండా క్లాస్ లా డీల్ చేసాడు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు నామినేషన్ అవ్వగా.. మొదటగా నిఖిల్ ని, ఆ తర్వాత నబిల్ ని సేవ్ చేశాడు. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓమ్ ని స్టేజ్ పైకి పిలిచి తన ఏవీ(AV) చూపింవాడు నాగ్ మామ. ఆదిత్య ఓం హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు.
Also Read