Karthika Deepam 2: కలిసిపోయిన ఆ ఇద్దరు.. శివన్నారాయణ ఒప్పుకుంటాడా!
on Oct 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2 ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -172 లో.....పూజ మా ఇంట్లో జరగాలని సుమిత్ర అనగానే.. మిమ్మల్ని ఇద్దరిని మా ఇంట్లో కలపాలనుకున్న కానీ అమ్మావారి సంకల్పం వేరేలా ఉందని దీప అనుకుంటుంది. అదంతా వింటున్న జ్యోత్స్న, పారిజాతంలు పక్కకి వెళ్లి.. అసలు మళ్ళీ దీప ఏం ప్లాన్ చేసిందనుకుంటారు. ఆ దీప ఏం చేసిందో కచ్చితంగా. నువ్వు తెలుసుకోమని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది.
ఆ తర్వాత దీపతో అనసూయ మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ .. ఆ పెద్దాయనకి తెలిస్తే ఊరుకోడని అనసూయ అంటుంది. రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది. ఎలాగైనా ఈ కుటుంబాలని కలపాలి దీప అంటుంది. అదంతా కిటికీలో నుండి నరసింహ వింటుంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు దీప, సుమిత్ర పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. శౌర్యని బాల త్రిపుర సుందరి దేవీగా సుమిత్ర రెడీ చేస్తుంది. ఇంట్లో ఎవరు లేరా అని దీప అనగానే.. జ్యోత్స్న, అత్తయ్యలు రెడీ అవుతున్నారు. ఆయన మావయ్య బయటకి వెళ్లారని సుమిత్ర అంటుంది. దాంతో తాతయ్య ఇంట్లో లేడని రీలాక్స్ అవుతుంది.అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు పూజ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత శౌర్యని సుమిత్ర రెడీ చేసి మురిసిపోతుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది.
ఆ తర్వాత దీపని అనసూయ పిలిచి.. కార్తీక్ వాళ్ళు వచ్చారని చెప్తుంది. దాంతో దీప వాళ్లకు ఎదరుగా వెళ్లి.. పూజ మా ఇంట్లో కాదు అక్కడ అని అనగానే.. మేమ్ రామని చెప్తారు. దానికి దీప రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే శౌర్య వచ్చి పద కార్తీక్ అంటూ తీసుకొని వెళ్తుంది. దీప లోపలికి వెళ్లి నాకు తెలిసిన వాళ్ళని పిలిచానని చెప్తుంది. దాంతో పారిజాతం వెటకారం గా మాట్లాడుతుంది. కార్తీక్ కాంచన లు రావడం చూసిన సుమిత్ర, పారిజాతం, జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమిత్ర, కాంచనలు ప్రేమగా మాట్లాడుకుంటారు. వాళ్ళని పిలిచినందుకు దీపకి థాంక్స్ చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత దశరథ్, శివన్నారాయణ లు జ్యోత్స్నకి పెళ్లి సంబంధం మాట్లాడి తిరిగి వస్తుంటారు. ఈ విషయం ఇంటికి వెళ్లి అందరికి చెప్పాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read