బెడిసికొట్టిన లాస్య ప్లాన్! ప్రేమ్-శ్రుతి శోభనం!!
on Jan 15, 2022
నటి కస్తూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సీరియల్ `ఇంటింటి గృహలక్ష్మి`. గత కొన్ని వారాలుగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ప్రేమ్ - శృతిలని బుక్ చేసి ఇంట్లో గొడవలు సృష్టించాలని, తులసికి మనశ్శాంతి లేకుండా చేయాలని లాస్య ప్లాన్ చేస్తుంది.. అయితే ఆ ప్లాన్ బెడికొట్టి ప్రేమ్ - శృతిలకు శోభనం జరిగేలా చేస్తుంది. అదేంటో.. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
పెళ్లి జరిగినా కూడా ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. తల్లి తులసి కష్టపడుతుంటే శోభనం అక్కర్లేదని, తులసి సంతోషంగా వున్నప్పుడే మనం కలవాలని ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. అయితే ఈ విషయం లాస్య చెవిన పడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లో గొడవలు సృష్టించాలని లాస్య ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తులసి .. ప్రేమ్ పై ఫైరవుతుంది. అతన్ని, శృతిని శోభనానికి ఒప్పిస్తుంది.
అంతా ఏర్పాట్లు చేస్తుంటారు. లాస్య తన జీవితంలో ఏదైనా మంచి పని చేసిందంటే అది ఇదే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా ప్రేమ్ - శృతిలకు మంచే జరిగిందని, ఈ హంగామా చూస్తే లాస్య కుళ్లుకుంటుందని అనసూయ అంటుంది. ఇక శృతిని పట్టుకుని ఒకే టికెట్ కు రెండు సినిమాలు అన్నట్టు ఒకే పెళ్లి కానీ రెండు శోభనాలు అంటూ ఆటపట్టిస్తుంది దివ్య. ఈ రోజు ప్రేమ్ - శృతి మధ్య శోభనం గదిలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.