ధీరజ్ నీ జీవితాన్ని కాపాడాడు.. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తారు?
on Jan 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -53 లో...... వేదవతి తన మేనకోడలని కాపాడమని ధీరజ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు ప్రేమ మెడలో తాళి కట్టమని ధీరజ్ కి చెప్తుంది. అందుకు ధీరజ్ ఒప్పుకోడు.. ఈ తల్లి కోసం ఇది చెయ్ రా అని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ ఇక చేసేదేమీ లేక ప్రేమ దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు పోలీసులు డోర్ కొడతారు. అప్పుడే వెనకాల నుండి ధీరజ్ లోపలికి వెళ్తాడు.
ఆ తర్వాత ప్రేమ కట్లు విప్పి తన మెడలో బలవంతంగా తాళి కడతాడు. అప్పుడే పోలీసులు లోపలకి వస్తారు. ధీరజ్ ని అరెస్ట్ చెయ్యమని కానిస్టేబుల్ కి ఎస్సై చెప్తాడు. ఎందుకు సర్ అని ధీరజ్ అడుగుతాడు. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని కంప్లైంట్ వచ్చిందని చెప్పగానే.. అలాంటిదేనీ లేదు సర్.. మేము భార్యాభర్తలమంటూ ధీరజ్ చెప్తాడు. అందరు అదే చెప్తారని పోలీస్ అంటాడు. లేదు సర్ అని ధీరజ్ అంటుండగా.. అప్పుడే నర్మద, వేదవతిలు వస్తారు. మొన్న పెళ్లి జరిగింది. గుడికి వచ్చామని వాళ్లు చెప్పగానే.. పోలీసులు వెళ్ళిపోతారు.ఆ తర్వాత ప్రేమ చచ్చిపోవడానికి వెళ్తుంటే ధీరజ్, ప్రేమ, వేదవతి వాళ్లు ఆపుతారు.
ఆ తర్వాత నా మెడలో తాళి ఎందుకు కట్టావని ధీరజ్ ని కొడుతుంది ప్రేమ. నీకు ఏమైనా పిచ్చా.. ఎందుకు నా కొడుకుని కొడుతున్నావ్.. నీ జీవితం కాపాడాడు.. నిన్ను తీసుకొని వచ్చినవాడు.. నిన్ను ప్రాస్టిట్యూషన్ కేసులో కళ్యాణ్ ఇరికించాడు. నిన్ను కాపాడడం కోసం వేరే దారి లేదని వేదవతి అంటుంది. అయిన వీడు నన్ను పెళ్లి చేసుకోవడమేంటి అంటూ ధీరజ్ పై కోపంగా ఉంటుంది ప్రేమ. ధీరజ్ మంచోడు నీ లైఫ్ బాగుంటుందని నర్మద అంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.. అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు ఉంది.. ప్రేమని ఇప్పుడు ఎలా ఇంటికి తీసుకొని వెళ్తామని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



