Illu illalu pillalu : అమ్మకి శుభలేఖ ఇచ్చిన వేదవతి.. కాల్చేయబోయిన భద్రవతి!
on Apr 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -123 లో.. చందుని శ్రీవల్లి ఇంటికి రమ్మని చెప్తుంది. చందు ఒక్కడే కాకుండా తన తమ్ముళ్లని వెంటపెట్టుకొని వస్తాడు. వాళ్ళ ముందు మాట్లాడడం కుదరదని భాగ్యం వాళ్లని బయటకు పంపిస్తుంది. ఇక భాగ్యం చెప్పినట్టుగా శ్రీవల్లి తన నటన మొదలుపెడుతుంది. మీకొక విషయం చెప్పాలి కానీ అది ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదండి.. నాకు టెన్షన్ గా ఉందని అంటుంటే ఏం పర్లేదు చెప్పండి అని చందు అంటాడు. అదంతా భాగ్యం దూరం నుండి చూస్తుంటుంది. ఈ పెళ్లి ఒక పది రోజులు వాయిదా వెయ్యండి అని శ్రీవల్లి చెప్తుంది. ఎందుకని చందు అడుగుతాడు.. మా వాళ్ళు డబ్బులు ఎవరికో అవసరం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు.. ఈ విషయం మా వాళ్ళు మీ వాళ్ళతో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే మీతో చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది.
అదంతా విని చందు షాక్ అవుతాడు. పెళ్లిపత్రికలు పంచాకా ఇప్పుడు వాయిదా అంటున్నారు. ఈ విషయం మా నాన్న కి తెలిస్తే తట్టుకోలేడు. నా వాళ్ళ మా నాన్న బాధపడకూడదని చందు ఎమోషనల్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి వేరే ఆప్షన్ లేదని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఆలోచించాలి.. డబ్బు ఎంత కావాలి అని చందు అడుగుతాడు. ఒక పది లక్షలు అని శ్రీవల్లి చెప్తుంది. పది లక్షలు సరే నేను ట్రై చేస్తానమని చందు చెప్పగానే శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వెనకుండి నడిపిస్తున్న భాగ్యం చూసి ఖుషి అవుతుంది. మరొకవైపు వేదవతి తన గుమ్మం ముందు నిలబడి వాళ్ళ అమ్మ బయటకు వస్తుందా అని చూస్తుంటుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. మా అమ్మ కోసం మొదటి శుభలేక తనకి ఇవ్వాలని చూస్తున్న కానీ తను బయటకు రావట్లేదని వేదవతి అంటుంది దాంతో మీకు ఇష్టమైన సాంగ్ ఉంది కదా అది ప్లే చేస్తే బయటకు వస్తుందని ప్లే చేస్తుంది. అది వినగానే వేదవతి వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది.
మొదటి శుభలేఖలు నీకే నువ్వు చందు పెళ్లికి తప్పకుండా రావాలని వేదవతి అనగానే.. నా మనవడి పెళ్లికి తప్పకుండా వస్తానని తను లోపలికి వెళ్తుంది. మరొకవైపు పది లక్షల గురించి చందు ఆలోచిస్తుంటాడు. అప్పుడే సాగర్ ధీరజ్ ఇద్దరు స్వీట్ తీసుకొని భాగ్యం ఇంటికి వస్తారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటని ధీరజ్ అంటాడు. అదేం లేదని భాగ్యం కవర్ చేస్తుంది. సాగర్ ధీరజ్, చందు, శ్రీవల్లి అందరు సెల్ఫీ తీసుకుంటారు. ఇక వాళ్ళు వెళ్లిపోతుంటే డబ్బుల విషయం వాళ్లకి చెప్పకని శ్రీవల్లితో భాగ్యం అనగానే.. చందుని పిలిచి డబ్బుల గురించి మీ వాళ్ళకి చెప్పకండి అని చెప్తుంది. దానికి చందు సరే అంటాడు. ఈ అన్నదమ్ముల మ్యాటర్ చూడాలి.... మా అల్లుడు వాళ్ళ మాట వింటే నా కూతురు మాట ఎలా వింటాడని భాగ్యం అనుకుటుంది. తరువాయి భాగంలో రామరాజు శుభలేఖలు ఇస్తుంటాడు. మరొకవైపు వేదవతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన కార్డు చూసి ఆ ఇంటి శుభలేఖ మన ఇంట్లో ఏంటని భద్రవతి కాల్చేయబోతుంటే విశ్వ వచ్చి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
