Illu illalu pillalu: పెళ్ళి పనుల్లో రామరాజు ఫ్యామిలీ.. మరి విశ్వ ఎత్తుగడ ఏంటి?
on Apr 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-124లో.. అన్నదమ్ములు ముగ్గురూ రెస్టారెంట్కి వెళ్తారు. అయితే చందు శ్రీవల్లి అడిగిన పది లక్షల గురించే ఆలోచిస్తుండు. అది చూసిన ఇద్దరు తమ్ముళ్లు.. ఏంటి అన్నయ్యా వదినతో ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నావ్.. ఇంతకు ముందు ప్రతి చిన్న విషయం మాతో చెప్పేవాడివి.. పెళ్లి కుదరగానే ఎంత మారిపోయావ్ అన్నయ్య అని ధీరజ్, సాగర్ ఇద్దరు అంటారు. చందు మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైందిరా.. దేనికో టెన్షన్ పడుతున్నావ్.. ఏమైందని మళ్లీ అడుగుతారు. ఏం లేదురా నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని చందు అంటాడు. అన్నయ్యా.. ఆ రోజు నీ ప్రేమ విషయాన్ని మా దగ్గర దాచేసి నరకం చూశావ్.. మాతో కూడా చెప్పలేదు. కానీ నీకు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు. నీ మనసులో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మాతో చెప్పు.. నీలో నువ్వు బాధపడకు. నాన్న చేతులపై ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వొక్కడివే నాన్న మాటకి విలువ ఇచ్చావని చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విలువను కాపాడుకోవాలిరా. ఇప్పటివరకు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. ఇకపై కూడా మనం అలాగే ఉందాం.. కాబట్టి చెప్పరా.. నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నావని చందుని ఇద్దరు అడుగుతారు.
మరోవైపు రామరాజు ఇంటింటికి తిరిగి శుభలేఖలు పంచుతాడు. ఆ తర్వాత నా కొడుకు పెళ్లి నా చేతులపై జరుగుతుందని వేదవతి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతాడు. నా పిల్లల పెళ్లి నా చేతులపై జరిపించాలని అనుకున్నాను.. కానీ చిన్నోడు, నడిపోడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్లి నా చేతులపై జరిపిస్తున్నా. తండ్రి మాటని జవదాటని విషయంలో నా పెద్ద కొడుకు నిజంగానే శ్రీరామ చంద్రుడు. వాడు వాడి ప్రేమనే త్యాగం చేశాడు. వాడు పొరపాటున కూడా ఈ నాన్నని మోసం చేయడు. కలలో కూడా అలాంటి ఆలోచన చేయడని రామరాజు ఎమోషనల్ అవుతాడు.
ఇటు రామరాజు మోసం చేయడని అంటాడు.. అటు చందు అదే పనిలో పడ్డట్టుగా చూపిస్తారు. ధీరజ్, సాగర్లు ఎంత అడిగినా కూడా.. ఆ పది లక్షల మ్యాటర్ గురించి నిజం చెప్పడు చందు. పెళ్లి పనుల గురించే మాట్లాడుకున్నాం.. మరేం లేదని చందు అంటాడు. మరోవైపు తొలి పెళ్లి శుభలేఖను తన తల్లి శారదాంబకి వేదవతి ఇస్తుంది. ఆ శుభలేఖలో తన భర్త పేరు.. తన పేరు ఉండటంతో నా అల్లుడుకి మేమంటే ఎంత ప్రేమ అని శారదంబ ఎమోషనల్ అవుతుంది. అయితే పెళ్లి శుభలేఖ గురించి కోడలితో మాట్లాడుతుండగా భద్రవతి వినేస్తుంది.
శారదాంబ చేతిలో ఉన్న శుభలేఖని తీసుకుని.. ఆ పనోడికి ఎంత ధైర్యం.. నీకే శుభలేఖ ఇస్తాడా.. అంటూ ఆ కార్డ్ని దేవుడి దీపం దగ్గర కాల్చేయబోతుంది. ఇంతలో మేనల్లుడు విశ్వ వచ్చి ఆపేస్తాడు. పెళ్లికి పిలిచినప్పుడు వెళ్లాలి కానీ.. శుభలేఖ కాల్చేస్తావ్ ఏంటి అత్తా.. మనం కూడా పెళ్లికి వెళ్లాలి అని అంటాడు. రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. ఆ రామరాజుగాడి కొడుకు పెళ్లికి మనం వెళ్లడమేంటి.. ఏం మాట్లాడుతున్నావని అంటుంది భద్రవతి. నేనేం మాట్లాడుతున్నానో.. పెళ్లి రోజున నీకు తెలుస్తుందిలే అత్తా.. చెప్పారుగా పెళ్లికి రమ్మని.. వెళ్తా.. వెళ్లి పెళ్లి తంతు చూసే వస్తా అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రవతి.. వీడేదో ప్లాన్ చేశాడని అనుకుంటుంది. మరోవైపు శ్రీవల్లి అడిగిన పది లక్షల కోసం చందు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
