త్రినయనికి కొత్త కారుని బహుమతిగా ఇచ్చిన భర్త చేతన్
on Jun 25, 2022
‘కథలో రాజకుమారి’ సీరియల్ పేరు చెప్తే చాలు ఆషిక గోపాల్ పడుకోనే గుర్తొస్తుంది. ఆ సీరియల్ తో ఈమె బుల్లితెరపై మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సీరియల్ కి అప్పట్లో మంచి రేటింగ్స్ వచ్చేవి. ఇక ఇప్పుడు 'త్రినయని' సీరియల్ లో నటిస్తోంది. ముందుగానే భవిష్యత్తు చూసి చెప్పే పాత్రలో కష్టాలు పడుతూ కనిపిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు జీ తెలుగు టాప్ 5 సీరియల్స్ లో ఒకటిగా నిలించింది. బుల్లితెరతో సరిపెట్టుకోకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసే పిక్స్ కూడా పెడుతూ ఉంటుంది ఆషిక.
ఐతే ఇప్పుడు ఆషిక చాలా హ్యాపీగా ఉందట. దానికి కారణం వాళ్ళ హబ్బీ చేతన్ అని చెప్తోంది. లైఫ్ పార్టనర్ ఒక రోజు సడెన్గా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే దాని ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా అంటోంది. "అలాంటి ఆనందమే ఇప్పుడు నాది. నాకు చెప్పకుండా ఒక కార్ షోరూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ ఒక కార్ లో టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్లాం" అని చెప్పింది.. ఇక ఫైనల్ గా తనకు యస్యువి (suv) కార్ కొని గిఫ్ట్ చేసారని చెప్పింది ఆషిక.
ఇప్పుడు భార్యాభర్తలు ఆ కారుకి పూజ చేయించి రైడ్ కి కూడా వెళ్లారట. "సాధారణంగా చేతన్ శెట్టి అన్ని నన్నే అడిగి ఏ పనైనా చేస్తాడు కానీ ఇప్పుడు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేసాడు" అంటూ మురిసిపోతోంది. ఆషిక, చేతన్ 2021 అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు. చేతన్ బేసిగ్గా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐనా సొంతంగా బిజినెస్ కూడా రన్ చేస్తుంటాడు.