Eto Vellipoyindhi Manasu : ఆ సాకుతో భర్తకి దూరంగా భార్య.. ఇదేం ట్విస్ట్ !
on Oct 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -228 లో... రామలక్ష్మిపై సీతాకాంత్ చెయ్ వెయ్యగానే.. ఇబ్బందిగా తీసేస్తుంది. నాకు కొంచెం నీరసంగా ఉందని రామలక్ష్మి అనగానే.. అయ్యో నాకు చెప్పలేదని, జ్వరం కూడ వచ్చినట్లుంది హాస్పిటల్ కి వెళదామని సీతాకాంత్ అనగానే.. వద్దు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని రామలక్ష్మి అంటుంది. సరే పడుకోమని సీతాకాంత్ సోఫాపై పడుకుంటాడు.
ఆ తర్వాత నందిని దగ్గరికి హారిక వచ్చి.. సీతాకాంత్ ని వదులుకోవడం ఇష్టం లేని రామలక్ష్మి తనకి నిజం చెప్తే ఎలా అని హారిక అంటుంది. అప్పుడేఅభి ఫోటోని హారికకి చూపించి.. వీడు రామలక్ష్మి మాజీ లవర్ వీడిని అడ్డుపెట్టుకుని సీతాకి రామలక్ష్మి పై డౌట్ వచ్చేలా చెయ్యాలని నందిని అంటుంది. ఫోటో పంపిస్తున్న వీడి డీటెయిల్స్ కావాలని నందిని అనగానే.. హారిక సరేనంటూ ఎవరికో ఫోన్ చేసి పంపించిన ఫోటో అతనికి డీటెయిల్స్ కావాలి అంటుంది. దాంతో అతను కాసేపటికి ఫోన్ చేసి అభి డీటెయిల్స్ పంపిస్తాడు. మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ ల ఫోటోని పట్టుకొని అభి కోపంగా ఉంటాడు.
ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు రాత్రి ఇంటికి రాలేదని సిరి అనగానే రామాలక్ష్మిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లి ఉంటాడని పెద్దాయన అంటాడు. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. నైట్ లేట్ అయింది. అందుకే అక్కడే ఉన్నామని సీతాకాంత్ చెప్తాడు. మరొకవైపు మాణిక్యం దగ్గరికి సుజాత, పింకీ వచ్చి.. పండుగ వస్తుంది. అమ్మాయిని అల్లుడుని పిలువమని అంటుంది. అల్లుడు నాపై కోపంగా ఉన్నాడు.. నువ్వు పిలువు అని సుజాతకి మాణిక్యం ఫోన్ ఇస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ ని దూరం పెట్టినందుకు బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి రామలక్ష్మికి ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్లి రామలక్ష్మి చేసిన పని గుర్తుచేసుకొని తన మనసులో ఏదైనా ఉందేమో.. అది చెప్తే నేను బాధపడతానని చెప్పట్లేదేమో.. ఇంకెప్పుడు రామలక్ష్మి ని బాధపెట్టొద్దని అనుకుంటాడు. అప్పుడే నందిని వచ్చి.. ఏంటి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read