Eto Vellipoyindhi Manasu : భర్త బాగుండాలని మోకాళ్లపై ప్రదక్షిణలు చేసిన భార్య!
on Sep 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -202 లో......యాగం చెయ్యడానికి అందరు గుడికి వస్తారు. అక్కడ స్వామి వేషంలో శ్రీలత చెప్పిన రౌడీ ఉంటాడు. అతన్ని చూసి రామలక్ష్మి మనిషా అని అడుగుతుంది. లేదు మన మనిషి.. ఇక మన పని ఈజీగా అవుతుందని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి సుజాతతో నాకు వచ్చిన కల గురించి తెలుసుకుంటానన్నావ్ కదా ఏమన్నాడని రామలక్ష్మి అడుగుతుంది. తెల్లవారు వచ్చే కలలు నిజం అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు అనగానే రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. అప్పుడే మాణిక్యం ఏమైందని అడుగగా జరిగింది చెప్తుంది. నువ్వేం బాధపడకు అల్లుడు గారికి ఏం కాకుండా నేను చూసుకుంటానని మాణిక్యం అంటాడు.
అప్పుడే సీతాకాంత్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. యాగం పనుల్లో నాన్న హెల్ప్ చేస్తానంటే వద్దని అంటున్నానని రామలక్ష్మి అనగానే.. చెయ్యమను మంచిదే కదా.. అప్పుడు అయినా బుద్ది వస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అసలు విషయం అల్లుడు గారికి ఎందుకు చెప్పలేదని సుజాత అనగానే.. నాకు ఆక్సిడెంట్ అయిన నుండి ఏ పని చెయ్యనివ్వడం లేదుమ ఇప్పుడు మోకాళ్ళ పై ప్రదక్షిణాలు చేస్తానంటే ఒప్పుకోడు.. నాన్న మీరు అయన పక్కనే ఉండండని రామలక్ష్మి మాణిక్యానికి చెప్తుంది. ఆ తర్వాత మాణిక్యం మందు బాటిల్ ని విసిరి పారేస్తాడు. ఇతనేంటి ఇలా చేస్తున్నాడని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేస్తారు. ఇద్దరు దూరం దూరంగా ఉండి స్నానం చేస్తుంటే.. ఇద్దరు దగ్గరగా ఉండి చెయ్యండి అని పెద్దాయన అంటాడు. మరొక వైపు రౌడీ కోనేటిలోకి కత్తి పట్టుకొని వస్తాడుమ అతను దగ్గరికి రావడం.. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మిలు కోనేటి నుండి బయటకు వస్తారు. ఆ తర్వాత చిన్న మొక్కు ఉంది చేసుకొని వస్తానంటు సుజాతని రామలక్ష్మి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి మోకాళ్ళపై ప్రదక్షిణలు మొదలు పెడుతుంది. రౌడీ రామలక్ష్మి ఎక్కడ వదిలి పెట్టకూడదని అనుకుంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మి ప్రదక్షిణలు చెయ్యడం సిరి చూస్తుంది. వదిన ఎందుకు అలా చేస్తుందిమ వెంటనే అన్నయ్యతో చెప్పాలి అనుకుంటుంది. మరొక వైపు రామలక్ష్మి అలా చెయ్యడం చూసిన శ్రీవల్లి.. కొబ్బరి చిప్పలు తన ముందు వేస్తుంది కానీ శ్రీవల్లి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత సిరి వెళ్లి సీతాకాంత్ తో చెప్పగానే రామలక్ష్మి దగ్గరికి సీతా కా వెళ్లి అడుగుతాడు. దాంతో పీడకల వచ్చింది.. మంచి జరగాలని చేస్తున్నాను. ఒక్కటి ఉంది ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. నా కూతురేం చేసిన మీ మేలు కోసం చేస్తుంది చేయనివ్వండని సుజాత అనగానే సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read