Eto Vellipoyindhi Manasu : భర్తకు దూరం ఉండాలన్న అత్త.. రామలక్ష్మి ఏం చేయనుంది!
on Aug 31, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -189 లో.. మీరు ఇలా పాత ఐడియాలు చేస్తూ పోతే ఆ రామలక్ష్మి తిప్పి కొడుతుంది. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంది. నేను ఉండగా మీకు ఆ పరిస్థితి ఎప్పటికి రానివ్వను. ఆ రామలక్ష్మి ఇక మన జోలికి రాకుండా ప్లాన్ చెయ్యాలని శ్రీలత అనగానే.. అలా జరగాలంటే దాన్ని లేపేయ్యాలని సందీప్ అంటాడు. ఇది జరగపోతే అదే చేద్దామని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలు విని శ్రీవల్లి షాక్ అవుతుంది.
మరొకవైపు సీతాకాంత్ అసలు నందిని ఎందుకు వచ్చింది? ఆ కంపెనీ నందినిది అని తెలిసి ఉంటే ఒప్పుకునే వాడిని కాదని సీతాకాంత్ అనుకుంటాడు. రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ మాట్లాడుకుంటుంటాడు. అప్పుడే రామలక్ష్మి, నందిని ఇద్దరు వస్తారు. అది నా ఫోటోలాగా ఉందేంటని రామలక్ష్మి అనుకుంటుంది. బోర్డు అఫ్ డైరెక్టర్స్ తో మీటింగ్ ఉందని నందిని అంటుంది. సీతాకాంత్ నందిని ఇద్దరు వెళ్తారు. ఆ ఫోటో ఎవరిదని రామలక్ష్మి చూసేసరికి తనదే ఉంటుంది. అది చూసి సీతా సర్ నన్ను ఇస్టపడుతున్నారన్న మాట అని హ్యాపీ గా ఫీల్ అవుతుంది. మరొకవైపు మీటింగ్ జరుగుతుంది. కంపెనీలో కొత్త యూనిట్ మొదలు చేస్తున్నాం.. దానికి పేరు పెట్టాలి.. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన వారి పేరు పెడితే బాగుటుందని సీతాకాంత్ అంటాడు. నా పేరే పెడుతాడని నందిని అనుకుంటుంది కానీ రామలక్ష్మి పేరు చెప్తాడు సీతాకాంత్. అందుకు రామలక్ష్మి ఒప్పుకోదు.. నందిని గారు కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని తన పేరు పెట్టండి అని రామలక్ష్మి అంటుంది. అందుకు నందిని నా పార్టనర్ నీ పేరు పెట్టాలి అన్నాడు కదా.. అతని ఇష్టమే నా ఇష్టమని నందిని అంటుంది.. ఆ తర్వాత నందిని ఇంటికి వెళ్ళాక.. సీతాకాంత్ గురించి తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హారిక వచ్చి సీతా సర్ కి తన భార్య ఇష్టం కాబట్టి తన పేరు యూనిట్ కి పెట్టాలి అనుకున్నాడని హారిక అనగానే.. ఇష్టం లేనివాళ్లు బయట పడొద్దని అలా చేస్తారని నందిని అంటుంది. అయితే నువు ఇష్టమని చెప్పలేదు కదా అని హారిక అనగానే.. అది నా మనసుతో చూడమని నందిని అంటుంది.
మరొకవైపు రామలక్ష్మి బ్యాంగిల్స్ వేసుకుంటూ ఇబ్బంది పడుతుంటే.. సీతకాంత్ రావట్లేదని కోపంగా ఉంటుంది. దాంతో సీతాకాంత్ వచ్చి బ్యాంగిల్స్ వేస్తాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. పక్షం రోజులు మీరు దూరంగా ఉండాలి కదా.. రామలక్ష్మి నా గదిలోకి రా అని శ్రీలత అంటుంది. వెళ్ళమని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. సిరితో ధన గురించి సీతాకాంత్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read